14కు చేరిన సోలన్ మృతులు...వారిలో 13 మంది ఆర్మి సైనికులే...!
హిమచల్ ప్రదేశ్లోని సోలన్ జిల్లాలో కుప్ప కూలిన సంఘటనలో మృతుల సంఖ్య పద్నాలుగుకు చేరింది. కాగా అందులో 13 మంది అర్మి సైనికులు గాక మరోకరు స్థానిక పౌరుడు. కాగ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారి వర్షాలకు సోలన్ జిల్లాలోని కుమార్ హట్టి అనే ప్రాంతంలో ఓ రెస్టారెంట్ కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో భవనంలో సుమారు 30 మంది వరకు ఆర్మి జవానులతోపాటు మరో రెండు కుటుంభాలకు చెందిన స్థానికులు భవన శిధిలాల క్రింద చిక్కుకున్నారు.
అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శిధిలాల క్రింద చిక్కుకున్న 5గురు జవాన్లతోపాటు మరో పన్నేండు మంది స్థానిక పౌరులను రక్షించారు.కాగా శిధిలాల క్రింద మరికొందరు చిక్కుకున్న నేపథ్యంలోనే వారిని వెలికి తీసేందుకు సహయక చర్యలు కొనసాగుతున్నాయి.
అయితే ఈ సంఘటన భారీ వర్షాలకు బిల్డింగ్ కుప్పకూలిందని ఆ రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్ ప్రకటించగా... స్థానికులు మాత్రం హోటల్ యజమాన్యం వల్లే ప్రమాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు... కోండ ప్రాంతం అయినా బిల్డింగ్ నిర్మాణం జరగడంతో వర్షాలకు కృంగి కూలిపోయిందని అంటున్నారు. కాగా హోటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు.