ఛీ.. పాడు డ్రైవర్.. రైలు ఆపి పట్టాలపైనే పని కానిచ్చాడు..! అవాక్కైన ప్రయాణీకులు..!!
ముంబాయి/హైదరాబాద్ : ఓ లోకో పైలట్ అంటే రైలు బండి నడిపే డ్రవర్ రైలును మధ్యలోనే ఆపి పట్టాలపైనే పని కానిచ్చాడు. దీంతో రైల్లో ఉన్న ప్రయాణీకులందరూ తమ సమయం వృధా చేసినందుకు సదరు డ్రైవర్ పై విరుచుకు పడ్డారు. అంత ఆత్రంగా ఉంటే ఇంట్లో చూసుకోవాలి గాని ఇలా పబ్లిక్ గా ప్రజలను ప్రజలతో పాటు ప్రయాణీకులను ఎందుకు ఇబ్బంది పెట్టడమని చిర్రెత్తిపోయారట ప్రయాణీకులు. ఈ సారికి ఇలా కక్కూర్తి పడితే పడ్డాడు గాని మరోసారి రిపీట్ చేస్తే పరిణామలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. అంతే కాకుండా అసలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లే తగిన గుణపాఠం చెబుతారని మరికొంత మంది ప్రదయాణీకులు మండిపడ్డారు. అంతెందుకు రైల్యే ఉన్నతాదికారులకు కంప్లైంట్ చేసి ఉద్యోగం నుంచి తీయించేస్తే యెదవకు తగిన శాస్తి జరుగుతుందని మరికొంత మంది ప్రయాణీకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఇంతకి సదరు డ్రైవర్ అంత దిగజారిపోయి ఎందుకు వ్యవహరించాడు.? అంత కక్కూర్తి పడడానికి కారణం ఏంటి..?
మీరు ఊహించుకుంటున్నట్లు రైలు డ్రైవర్ ఏం పని చేసారనుకుంటున్నారో తెలుసా..? మీరనుకున్నట్టు ఆ పని కాదులెండి. ఆ లోకోపైలట్ కు అర్జంట్గా మూత్రం రావడంతో..ఆయన రైలు ఆపి కిందికి దిగి రైలు ఎదురుగా పట్టాలపైనే మూత్రం పోసాడు. ఇక వివరాలలోకి వెళితే...ముంబయికి చెందిన సోను షిండే అనే వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద నుంచి నడుచుకుని వెళ్తుండగా లోకో పైలట్ రైలు ఆపి కిందికి దిగడాన్ని చూశాడు. రైలు ఎదురుగా పట్టాలపైనే అతడు మూత్రం పోయడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే తన కెమేరా తీసి వీడియో తీశాడు. ఆ వీడియో ట్విట్టర్లో ప్రత్యక్షం కావడంతో వైరల్గా మారి రైల్వే ఉన్నతాధికారులకు చేరింది. ఈ ఘటనపై సీనియర్ సెంట్రల్ రైల్వే ఆఫీసర్ స్పందిస్తూ.. 'ఈ వీడియో మాకు అందింది. ఈ ఘటనపై ఇంకా విచారణ జరుగుతోంది' అని తెలిపారు. ఈ వీడియో పై స్పందించిన ఓ నెటిజన్.. లోకల్ రైళ్లు నడిపే లోకో పైలట్లకు విశ్రాంతి దొరకడం చాలా కష్టం. సుమారు 3 నుంచి 5 గంటలు ఆగకుండా రైలును నడుపుతూనే ఉండాలి. ఈ నేపథ్యంలో వారికి మూత్రం పోసుకోడానికి కూడా సమయం చిక్కదు. దీంతో ఆ లోకో పైలట్ అలా చేయడంలో తప్పులేదని అన్నాడు. అయితే, అతను ట్రాక్ మీద కాకుండా పక్కకి వెళ్లి ఆ పనిచేసి ఉంటే బాగుండేదని మరికొందరు అంటున్నారు.