టిఫిన్స్ బాక్స్ కడగమని చెప్నిన పైలట్...సిబ్బందికి, పైలట్కు మధ్య వాగ్వాదం..
అత్యసరాలతోపాటు కోట్లాదీ రుపాయల వ్యాపారం చేసే వ్యాపారవేత్తలు, టైం సేవ్ కోసం ఆయా దేశాలు, రాష్ట్ర్రాల్లో తమ వ్యాపారాలు చూసుకోవడం కోసం విమానాల్లో ప్రయాణాలు చేస్తుంటారు.దేశీయ విమానాల్లో ప్రయాణం చేసే వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకే వేల రుపాయలు పెట్టి విమానప్రయాణం చేస్తారనడంలో సందేహం లేదు..వారికి ప్రతి నిమిషం కూడ చాల విలువైనదిగా ఉంటుది.. అలాంటీ విలువైన విమాన ప్రయాణికుల సయమాన్ని సుమారు గంటపాటు వేస్ట్ చేశారు.తమలో తాము గొడవ పెట్టుకుని ఏకంగా గంటపాటు విమానాన్ని ఎయిర్ పోర్టులోనే ఆపారు.
సోమవారం ఢిల్లి నుండి బెంగళూరు బయలుదేరాల్సిన సమయంలో ఎయిర్ ఇండియా విమాన పైలట్ తాను తిన్న లంచ్బాక్స్ను క్లీన్ చేయమని విమాన సిబ్బందికి చెప్పాడు. దీంతో ప్రయాణికుల సేవల కోసమే పనిచేసే సిబ్బంది పైలట్ బాక్స్ను క్లీన్ చేసేందుకు నిరాకరించారు. దీంతో అటు పైలట్కు ఇటు సిబ్బందికి మధ్య ప్రయాణికుల ముందే వాగ్వావాదం జరిగింది. ఫలితంగా సమయానికి బయలు దేరాల్సిన విమానం ఆపాడు పైలట్ దీంతో విమానం గంటపాటు ఆలస్యంగా టేక్ఆఫ్ అయింది.
దీంతో ప్రయాణికులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఆలస్యనికి గల కారణలపై విచారణ చేసిన అధికారులు ఇద్దరి వివాదంపై నివేదిక తయారు చేశారు. ప్రస్థుతానికి వారిని విధులకు దూరంగా ఉంచారు. ఈనేపథ్యంలోనే వివాదానికి కారణమైన సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ఇక ఇదే విషయాన్ని డీజీసీఏకు కూడ చెప్పారు.