ఆ... ముసుగులో ఇంజనీర్ ట్రాప్... రూ. 3 కోట్లు డిమాండ్...! భారీ సెక్స్ రాకెట్ చేధించిన పోలీసులు
మధ్యప్రదేశ్ పోలీసులు భారీ సెక్స్ రాకెట్ను చేధించారు. రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాలో మొత్తం పద్దేనిమిది మహిళలు ఈ సెక్స్ రాకెట్లో పాల్గోన్నారు. ముఖ్యంగా వ్యాపారవెత్తలు, రాజకీయా నాయకులను టార్గెట్ చేసుకున్న బృందం వీడియోలు తీసీ బ్లాక్ మెయిల్ చేస్తారు. వీళ్ల మాయలో పడిన వారు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన అనేక మంది ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ముఠా మాయలో పడిన ఓ మాజీ ఎంపీ ఏకంగా ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఓ ఇంజనీర్ మూడు కోట్ల రుపాయలు డిమాండ్ చేశారు.
మధ్యప్రదేశ్ భారీ సెక్స్ రాకెట్
మధ్యప్రదేశ్లో హై లెవల్ సెక్స్ రాకెట్ను పోలీసులు చేధించారు. అరతి దయాల్ అనే మహిళతోపాటు మరో ముగ్గురుని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరతి దయాలో అనే మహిళ భర్త నుండి విడిపోయి బోపాల్ ప్రాంతానికి చేరుకుంది. అయితే అప్పటికే ఆమేకు అనేక పరిచయాలు ఉన్నాయి. బోపాల్ ప్రభుత్వంలోని వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్దికి సంబంధించి ప్రభుత్వ సహకారంతో ఓ ఎన్జీవో ఆర్గనైజేష్ కూడ నడుపుతోంది.
హైలెవల్ అధికారులతో సంబంధాలు
ఈ నేపథ్యంలోనే ఎనిమిది నెలల క్రితం బోపాల్లోని ఓ ఐఏఎస్ అధికారి సహయంతో కాస్లీ ఎరియాలో ఇల్లును కిరాయకు తీసుకుంది. అక్కడ నుండి తన సెక్స్ కార్యకలాపాలకు తెరలేపింది. ఇందుకోసం మరో ఎన్జీవో ఆర్గనైజన్లో పని చేస్తున్న 18 యువతులను సెక్స్ రాకేట్ కోసం ఉపయోగించుకుంది. ముఖ్యంగా ధనవంతులు, రాజకీయనాయకులను రాకెట్లో టార్గెట్ చేస్తోంది. వారిని ట్రాప్లో పడేసి, అనంతరం వారి కార్యకలాపాలను వీడియో తీయిస్తోంద. అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఇలా గత కొంతకాలంగా ఆమే వ్యవహారం నడుపుతోంది.
ఉద్యోగమంటూ ఇంజనీర్కు గాలం
అయితే ఇటివల హర్భజన్ సింగ్ అనే ఇంజనీర్కు సెక్స్ రాకెట్లో భాగమైన ఆర్తి అనే మహిళ మరో 18 సంవత్సరాల యువతిని పరిచయం చేసింది. యువతికి ఉద్యోగం కావాలని ఇంజనీర్ను ట్రాప్లోకి దింపింది. అనంతరం ఇంజనీర్ మరియు 18 సంవత్సరాల యువతి ఓ హోటల్లో ఏకంతంగా గడిపారు. ఆ దృశ్యాలను ఆర్తీ వీడియో తీసింది. అనంతరం హర్బజన్కు చూపించి బ్లాక్ మెయిల్ చేసింది. వీడియో డిలిట్ చేసేందుకు మూడు కోట్ల రుపాయాలు డిమాండ్ చేసింది.
ముఠా ట్రాప్లో పడిన మాజీ ఎంపీ ..
దీంతో ఖంగుతిన్న హర్భజన్ పోలీసులకు పిర్యాధు చేశాడు. పోలీసుల స్కెచ్లో భాగంగానే ఆర్తికి యాబై లక్షల రుపాయలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. యాబైలక్షల రూపాయలను తీసుకునేందుకు ఆర్తీ తోపాటు మరో ఇద్దరు మహిళలు ,వారితో డ్రైవర్ వచ్చారు. డబ్బులు తీసుకునే సమయంలో పోలీసులు వలపన్ని మొత్తం ముగ్గురు మహిళనలు అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. సెక్స్ రాకేట్ ముఠా తమ కార్యకలాపాలను రాష్ట్రంలోని మొత్తం 12 జిల్లాల్లో నడుపుతున్నట్టు తేలింది. ఇక వీళ్ల ట్రాప్లో పడిన ఓ మాజీ ఎంపీ సైతం ఆత్మహత్య యత్నానికి కూడ పాల్పడినట్టు స్థానిక మీడియా కథనాలు వెలువరించింది.