మైసూరు కోర్టు బాంబు పేలుడు కేసు: చిత్తూరు కోర్టులో, ఇక్కడా వారే, ఎఫ్ఐఆర్ !
మైసూరు కోర్టు ఆవరణంలో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబందించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మే 24 చార్జిషీట్ దాఖలు చేసింది.
మైసూరు: మైసూరు కోర్టు ఆవరణంలో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబందించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మే 24 (బుధవారం) చార్జిషీట్ దాఖలు చేసింది. బేస్ మూమెంట్ లేదా అల్ ఉమ్మా ఉగ్రవాదులు మైసూరు కోర్టు ఆవరణంలో బాంబు పెట్టి ఉంటారని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
మైసూరు కోర్టు ఆవరణంలోని మూత్రవిసర్జనశాలలో జరిగిన బాంబు పేలుడు కేసుకు సంబంధించి బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో బుధవారం ఎఫ్ఐఆర్ సమర్పించారు. మైసూరు కోర్టు ఆవరణంలో జరిగిన బాంబుపేలుడులో తలుపు, కిటికీలు ద్వంసం అయ్యాయి.
దక్షిణ భారతదేశంలో తన నెట్ వర్క్ విస్తరించడానికి అల్ ఉమ్మా, బేస్ మూమెంట్ ఉగ్రవాదులు ఈ బాంబు పేలుడు సృష్టించి ఉంటారని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు కోర్టు ఆవరణంలో గతంలో బాంబు పేలుడు జరిగిన విషయం తెలిసిందే.
ఆ సందర్బంలో ఉగ్రవాదులు బేస్ మూమెంట్ పేరుతో ఓ లేఖ పంపించారు. ఆ లేఖలో ఒసామా బిన్ లాడెన్ ఫోటో కూడా ఉంది. అందులో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో బేస్ మూమెంట్ పేరుతో బాంబు దాడులు చేస్తామని ఉగ్రవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే.