అమ్మకానికి భారతీయుడి హోటల్: ట్రంప్ పెళ్ళి ఇక్కడే
ప్లాజా హోటల్ను విక్రయించేందుకు సహరా ప్రయత్నాలుఈ హోటల్కు 110 ఏళ్ల చరిత్ర ఉంది.ట్రంప్ రెండో వివాహం ఈ హోటల్లోనే జరిగింది.
ముంబై: ప్లాజా హోటల్ను విక్రయించేందుకు సహరా పరివార్ ప్రయత్నాలను ప్రారంభించింది. న్యూయార్క్లో ఈ హోటల్ ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు జోన్స్లాంజ్ లాసేల్ ఇంక్ను సహరా ఇండియా పరివార్ మధ్యవర్తిగా ఎంపిక చేసుకొంది.
జెఎల్ఎల్ సంస్థ డైరెక్టర్ జెఫ్డేవీస్ ఈ మేరకు ఈ విషయాన్ని ధృవీకరించారు. గతంలోనే ఈ హోటల్లో కొంచెం భాగాన్ని అష్కేన్జీ ఎక్విజైషన్స్ సంస్థ కొనుగోలు చేసింది. దీనిలో సౌదీ రాజకుటుంబానికి చెందిన అల్వీద్ బిన్ తలాల్ కూడా భాగస్వామి. ప్రస్తుతం ఈ విక్రయం విషయమై సహారా, అష్కేన్జీ, అల్వీద్ కింగ్డమ్ హోల్డింగ్స్ స్పందించలేదు.
సహారా పరివార్ ఇప్పుడు విక్రయానికి పెట్టిన ది ప్లాజా హోటల్కు 110ఏళ్ల చరిత్ర ఉంది. ఇది న్యూయార్క్లోని అత్యంత కీలకమైన ఫిఫ్త్ ఎవెన్యూలో ఉంది. ఇది ఎన్నో చారిత్రక ఘటనకు సాక్ష్యంగా నిలిచింది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో వివాహం కూడా ఇక్కడే జరిగింది.
ఒకప్పటి దీని యజమానుల్లో ట్రంప్ కూడా ఒకరు. దీనిని విక్రయించేందుకు సుబ్రతో రాయ్ రెండేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు.