తమిళ తంబీల బాషాభిమానం...మరోసారీ...
తమిళ నేతలు మరోసారి తమ భాషా అభిమానాన్ని చాటుకున్నారు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సిబ్బంది, కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలను ఇంగ్లీష్ లేదా హిందిలోనే పంపిచాలని ఆదేశాలు వెళ్లాయి. అయితే ఈ సర్క్యూలర్ పై డీఎంకే అధినేత స్టాలిన్ స్పందిచారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులను తీవ్రంగా మందలించారు.
మరోవైపు రైల్వే విడుదల చేసిన ఆదేశాలతో రైల్వే మజ్ధుర్ యూనియన్ కూడ ఫైర్ అయింది. దక్షినాదిలో హిందిని ప్రచారం చేసి స్థానిక బాషనలు అణగదొక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు.ముఖ్యంగా తమిళనాడులో హిందిని ప్రవేశపెట్టాలని చూస్తున్నారని వారు విమర్శలు చేశారు. అధికారులతో మాట్లాడలంటే హింది, ఇంగ్లీష్ బాషలు నేర్చుకోవాలా అంటు ప్రశ్నించారు.
దీంతో ఈ విషయాన్నీ డీఎంకే అధినేత స్థాలిన్ దృష్టికి తీసుకెళ్లారు.ఇక స్టాలిన్ కూడ రైల్వే అధికారుల తీరుపై మండిపడ్డారు. తమిళ బాషను అణగదొక్కేందుకే ఇలాంటీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన సిరియస్ అయ్యారు. దీంతో రైల్వే అధికారులు వెనక్కి తగ్గారు. అంతకు ముందు ఇచ్చిన సర్క్యూలర్ను వెనక్కి తీసుకుంటూ మరో సర్క్యూలర్ను జారీ చేశారు.