నేతల కులమతాల ప్రసంగాలు..! ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
ఢిల్లీ : సున్నితమైన కులమతాల అంశాన్ని అడ్డుపెట్టుకుని.. అడ్డదిడ్డంగా ప్రసంగాలు చేసే లీడర్లపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆ రోజుకు వాయిదా వేసింది.
మా ఫ్యామిలీ ప్రధానులు ఏమి చేయలేదు..! మోడీని మించిన PM లేరు : వరుణ్ గాంధీ
రాజకీయ పార్టీలకు చెందిన వివిధ స్థాయి నేతలు, అధికార ప్రతినిధులే టార్గెట్ గా.. షార్జాలో నివసించే హర్ప్రీత్ మన్సుఖనీ అనే ఎన్నారై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. వారు కులమతాల గురించి ప్రసంగించినా, ఆరోపణలు చేసినా.. కఠిన చర్యలు తీసుకోవాలన్నది దాని సారాంశం. అంతేకాదు కులమతాల ప్రాతిపదికన డిబేట్లు పెట్టే మీడియా సంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
హర్ప్రీత్ మన్సుఖనీ పిటిషన్ కు సంబంధించి.. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్దే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. అనంతరం ఈ పిటిషన్ పై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని కోరుతూ ఆదేశాలు జారీ చేసింది.