డీకే. శివకుమార్ కు నో బెయిల్, 25 వరకు తీహార్ జైలే, ఇంకా చాల మంది ఉన్నారు !
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు బెయిల్ రాలేదు. సెప్టెంబర్ 25వ తేదీన బెయిల్ ఇచ్చే విషయంలో తీర్పు చెబుతామని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక కోర్టు శనివారం చెప్పంది. కోర్టు ఆదేశాలతో తీహార్ జైలులో ఉన్న డీకే శివకుమార్ ఈనెల 25వ తేదీ వరకు అక్కడే ఉండాలి. ఈ కేసులో ఇంకా చాల మందిని విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు అంటున్నారు.
పిల్ల కావాలని పెళ్లి ప్రకటన, కొంప ముంచిన ఇటలీ యువతి, నెలకు రూ. 1 లక్ష వడ్డి !
బెయిల్ ఇవ్వండి
మూడు రోజులు పాటు ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో డీకే. శివకుమార్ బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. శనివారం మద్యాహ్నం వరకు కోర్టులో వాదనలు జరిగాయి. భోజనం విరామం తరువాత బెయిల్ పిటిషన్ పై తీర్పు వస్తుందని డీకే శివకుమార్ భావించారు.
సెప్టెంబర్ 25
భోజనం విరామం తరువాత కోర్టుకు వచ్చిన న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ సెప్టెంబర్ 25వ తేదీ బెయిల్ ఇచ్చే విషయంలో తీర్పు చెబుతామని అనడంతో డీకే. శివకుమార్, ఆయన వర్గీయులు షాక్ తిన్నారు. ఈనెల 3వ తేదీన డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
తీహార్ జైలు
అనార్యోగంతో ఉన్న డీకే. శివకుమార్ ను రెండు రోజులతో పాటు ఆసుపత్రిలో చేర్పించిన ఈడీ అధికారులు తరువాత వారి కస్టడకి తీసుకున్నారు. కస్టడీ విచారణ పూర్తి కావడంతో డీకే. శివకుమార్ ను తీహార్ జైలుకు పంపించారు. తీహార్ జైలులో ఉన్న డీకే. శివకుమార్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.
మనీ ల్యాండరింగ్ కేసు
మనీ ల్యాండరింగ్ కేసులో డీకే. శివకుమార్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. డీకే. శివకుమార్ కుమార్తె ఐశ్వర్య, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్, డీకే. శివకుమార్ మామ తిమ్మయ్యలను ఈడీ అధికారులు విచారణ చేశారు. ఇంకా చాల మందిని డీకే శివకుమార్ కేసులో విచారణ చెయ్యాలని ఈడీ అధికారులు కోర్టులో చెప్పారు.