200 లీటర్ల నూనే పట్టే దీపావళీ ప్రమిద
దేశవ్యాప్తంగా దీపావళీ వేడుకలు అంత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీపావళీ అంటే ఇంటి చుట్టు దీపాల కాంతులతో వెదజల్లుతుంటాయి. దీపాలు లేకుండా దీపావళీని జరుపుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటీ నేపథ్యంలోనే పలు కార్యాలయాలు, ప్రయివేట్ సంస్థుల పెద్ద ఎత్తున దీపాలంకరణ చేస్తాయి. దీపాలంకరణతోనే దీపావళీకి ఓ కళ వస్తుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ దీపాకాంతులతో దేశం మొత్తం కాంతులు వెదజల్లుతోంది.
అయితే మాములుగా అందరు జరుపుకున్నట్టే దీపావళీ జరుపుకుంటుంటే ఎం బాగుంటుందని భావించిన గువాహాటి వాసులు మాత్రం ఇందుకు విభిన్నంగా వ్యవహరించారు. దీపావళీకి ఇళ్లల్లో చిన్న దీపాలను అలంకరిస్తుంటే వాళ్లు మాత్రం ఏకంగా రెండువందల లీటర్లు నూనే పట్టే ఓ దీపం ప్రమిదను తయారు చేశారు. ఈ భారీ దీపం ఎనిమిది అడుగుల వెడల్పు , రెండు అడుగుల ఎత్తు ఉంది.
దీంతో ఈ దీపాన్ని వెలిగించేందుకు ఓ పెద్ద తాడులాంటీ వత్తిని తయారు చేయాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. కాగా ఈ దీపం ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. కాగా ఈ దీపాన్ని అస్సాం రాష్ట్రం, గువాహటిలోని దిఘోలీ వద్ద గల ఓ సరస్సు ఒడ్డున తయారు చేసి వెలిగించారు.