బిజెపి, ఆర్ఎస్ఎస్లతో నా ప్రాణాలకు ముప్పుంది: జిగ్నేష్ మేవానీ
అహ్మదాబాద్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ వల్ల తనకు ప్రాణహాని ఉందని గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నాయకుడు జిగ్నేష్ మేవానీ ఆరోపించారు. బీజేపీ, సంఘ్పరివార్ తనను హత్య చేయించేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ మేరకు తనవద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన ఆరోపణలు చేశారు.
ఫాసిస్టు భావజాలం కలిగిన వ్యక్తులు, సంస్థలు తనను తప్పకుండా చంపేందుకు ప్రయత్నాలు చేస్తాయని మేవానీ అభిప్రాయపడ్డారు.. నన్ను భూమ్మీద లేకుండా చేయడంతో తాత్కాలికంగా ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉందని మేవానీ అభిప్రయాపడ్డారు.
లాభాన్ని పొందేందకు ప్రయత్నిస్తున్నారని మేవానీ అన్నారు. జిగ్నేష్ మేవానీ ప్రాణ రక్షణకు వై కేటగిరీ భద్రతను కల్పించాలని దళిత సంఘాలు గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
తమిళనాడు రాష్ట్రంలో మేవానీ ఇంగ్లీష్ మీడియా చానల్స్తో మాట్లాడేందుకు నిరాకరించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మేవానీ ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్తో మాట్లాడేందుకు అంగీకరించలేదు. అయితే ఈ మేవానీ కార్యక్రమాన్ని మీడియా బహిష్కరించింది.