వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూజర్ల డేటా దొంగతనం: యూసీ బ్రౌజర్‌పై నిషేధానికి కేంద్రం రెఢీ?

భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది. ఈ తరుణంలో యూసీ బ్రౌజర్ వినియోగదారుల డేటాను సేకరిస్తోందనే సమాచారంపై కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది.

డేటా దొంగతనానికి పాల్పడుతున్నారంటూ చైనా కంపెనీలపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

 This ‘most popular’ smartphone browser in India may be banned

ఒకవేళ యూజర్ల డేటా దొంగతనానికి వెబ్‌పై నిషేధం విధించే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాదికారి ఒకరు తెలిపారు.

యూసీ బ్రౌజర్‌పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ అధికారి తెలిపారు. చైనాలోని సర్వర్లకు భారత్ యూజర్ల మొబైల్ డేటాను పంపిస్తోందని.....ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నామని ఆ అధికారి తెలిపారు.

యూసీ బ్రౌజర్‌కు భారత్‌లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 100 మిలియన్లకు పైనే ఉన్నాయి. గ్లోబల్‌గా దీని యూజర్ బేస్ 420 మిలియన్లు. గూగుల్ క్రోమ్ తర్వాత భారత్‌లో అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ యూసీ .

యూసీ బ్రౌజర్ మొబైల్ ఫోన్ సెగ్మెంట్ యాడ్స్‌లో మార్కెట్ షేరు 48.7 శాతమైతే యూసీ వెబ్ సెక్యూరిటీని ప్రైవసీని చాలా సీరియస్‌గా పరిగణణలోకి తీసుకొంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.

యూజర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను ఏర్పాటు చేయడం ఐటీ కంపెనీల సాధారణ పద్దతని చెప్పారు.తాము ఎలాంటి యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేయడం లేదన్నారు.

యూజర్ల డేటాను సేకరించడంపై ఆ సంస్థ సమర్థించుకొంటుంది.యూజర్ల సమాచారాన్ని డేటాను సేకరించడం ఇండస్ట్రీ పద్దతిలో భాగమంది. యూజర్ల ప్రయోజనాలను తాము కాపాడుతామని ప్రకటించింది.

English summary
UC Web, the browser owned by Chinese internet giant Alibaba, has come under the scrutiny of the government as part of investigations against Chinese companies over alleged data theft. If found guilty of stealing data of Indian users, the company (UC Web) may be banned in the country , a top official in the ministry of electronics and IT said. “Complaints have been received against UC Browser that it sends mobile data of Indian users to servers in China. The matter is being looked into,” the official said, requesting anonymity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X