యూజర్ల డేటా దొంగతనం: యూసీ బ్రౌజర్పై నిషేధానికి కేంద్రం రెఢీ?
భారత్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది.
న్యూఢిల్లీ: భారత్లో అత్యంత ప్రాచుర్యం పొందిన యూసీ బ్రౌజర్ వెబ్ రద్దు కాబోయే అవకాశాలున్నట్టు సమాచారం.భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలను పురస్కరించుకొని చైనాకు చెందిన కంపెనీలపై భారత్ కన్నేసింది. ఈ తరుణంలో యూసీ బ్రౌజర్ వినియోగదారుల డేటాను సేకరిస్తోందనే సమాచారంపై కేంద్రం ఈ దిశగా అడుగులు వేయనుంది.
డేటా దొంగతనానికి పాల్పడుతున్నారంటూ చైనా కంపెనీలపై వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒకవేళ యూజర్ల డేటా దొంగతనానికి వెబ్పై నిషేధం విధించే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాదికారి ఒకరు తెలిపారు.
యూసీ బ్రౌజర్పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని ఆ అధికారి తెలిపారు. చైనాలోని సర్వర్లకు భారత్ యూజర్ల మొబైల్ డేటాను పంపిస్తోందని.....ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొంటున్నామని ఆ అధికారి తెలిపారు.
యూసీ బ్రౌజర్కు భారత్లో నెలవారీ యాక్టివ్ యూజర్లు 100 మిలియన్లకు పైనే ఉన్నాయి. గ్లోబల్గా దీని యూజర్ బేస్ 420 మిలియన్లు. గూగుల్ క్రోమ్ తర్వాత భారత్లో అత్యధికంగా వాడుతున్న వెబ్ బ్రౌజర్ యూసీ .
యూసీ బ్రౌజర్ మొబైల్ ఫోన్ సెగ్మెంట్ యాడ్స్లో మార్కెట్ షేరు 48.7 శాతమైతే యూసీ వెబ్ సెక్యూరిటీని ప్రైవసీని చాలా సీరియస్గా పరిగణణలోకి తీసుకొంటుందని ఆ కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు.
యూజర్లకు మెరుగైన సేవలను అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను ఏర్పాటు చేయడం ఐటీ కంపెనీల సాధారణ పద్దతని చెప్పారు.తాము ఎలాంటి యూజర్ల నమ్మకాన్ని వమ్ము చేయడం లేదన్నారు.
యూజర్ల డేటాను సేకరించడంపై ఆ సంస్థ సమర్థించుకొంటుంది.యూజర్ల సమాచారాన్ని డేటాను సేకరించడం ఇండస్ట్రీ పద్దతిలో భాగమంది. యూజర్ల ప్రయోజనాలను తాము కాపాడుతామని ప్రకటించింది.