ఇదెలా సాధ్యం అబ్బా: మార్కుల్లో రికార్డు సృష్టించిన కుర్రాడు..ఇప్పుడొక మినీ సెలబ్రిటీగా..!
ఈ రోజుల్లో పిల్లలను పిల్లలనడం కంటే పిడుగులు అనాలనిపించేలా ఉన్నారు. చదువుల్లో పోటీ మీద పోటీ పడి చదువుతున్నారు. ఒకప్పుడు బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉండేది. కాలక్రమంలో ఒక విద్యార్థి ఉత్తీర్ణతశాతం 90శాతంకు పైనే ఉంటోంది. దీంతో వారికి చదువుచెప్పిన గురువులు వారిని కన్న తల్లిదండ్రులు తోటి స్నేహితులు ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. అయితే అందరూ మార్కులు ఎక్కువగానే తెచ్చుకుంటున్నారు. ఇది చాలా కామన్ అయిపోయింది. కానీ ముంబైలో ఓ కుర్రాడు మాత్రం తాను సాధించిన మార్కులతో ఒక్కరోజులోనే ఒక మినీ సెలబ్రిటీగా మారాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు.. ఆయన సాధించిన మార్కులు ఏంటి..?
అన్ని సబ్జెక్టుల్లో ఒకే రకమైన మార్కులు
ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న కుర్రాడి పేరు అక్షిత్ జాధవ్. ముంబైలోని శాంతినగర్ హైస్కూల్లో చదవుతున్నాడు. అయితే ఈ కుర్రాడు సాధించిన ఘనత ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ముంబైలో ఈ కుర్రాడు ఎవరా అని చాలామంది వేట కొనసాగించారు. దీంతో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. ఇంతకీ జాదవ్ సాధించిన ఘనతేంటో తెలుసా... మహారాష్ట్ర సర్కార్ నిర్వహించిన 10వ తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో 35 మార్కులు సాధించి పాస్ అవడం.
వైరల్గా మారిన మార్కుల జాబితా
ఈ
మధ్యకాలంలో
విద్యార్థులంతా
90శాతంకు
పైగా
మార్కులు
సాధిస్తుంటే...
జాదవ్
మాత్రం
ప్రతి
పేపర్లో
35
మార్కులు
సాధించాడు.
ఇలా
సాధించడంతో
ప్రతి
ఒక్కరూ
ఈ
కుర్రాడి
గురించే
చర్చించుకుంటున్నారు.
ఈ
కుర్రాడి
మార్క్లిస్టు
కూడా
సోషల్
మీడియాలో
వైరల్
కావడంతో
అందరి
దృష్టినీ
ఆకర్షించాడు
జాదవ్.
పర్ఫెక్ట్
మార్కులతో
పాస్
అయ్యాడని
ఒక
నెటిజెన్
కామెంట్
చేశాడు.
ఈ
ఘనత
ఇక
మీదట
ఎవరూ
సాధించలేరని
మరికొందరు
వ్యాఖ్యానించారు.ఇక
జాదవ్
తల్లిదండ్రులు
తన
కొడుకు
పాస్
అవడంపై
సంతోషం
వ్యక్తం
చేశారు.
అదేసమయంలో
భవిష్యత్తులో
మంచిగా
సెటిల్
అవ్వాలని
కోరుకున్నారు.
Recommended Video
ఫుట్బాల్ ఆటగాడిగా తయారవుతాడు
ప్రతీ
విద్యార్థి
తమకు
ఇచ్చిన
ప్రశ్నను
బాగా
రాసి
మంచి
మార్కులు
సాధించేందుకు
ప్రయత్నిస్తారని
తన
కొడుకు
కూడా
మంచి
మార్కులు
సాధించేందుకే
ప్రయత్నించాడని
అయితే
తక్కువ
మార్కులతో
పాసై
గట్టెక్కాడని
తండ్రి
గణేష్
సంతోషం
వ్యక్తం
చేశాడు.
ప్రైవేటుగా
పరీక్షలు
రాశాడని
అయితే
ఫుట్బాల్
బాగా
ఆడుతాడని
తల్లి
అరుణ
చెప్పింది.
భవిష్యత్తులో
మంచి
ఫుట్బాల్
ఆటగాడిగా
తయారు
అవుతాడని
జాదవ్
తల్లి
అరుణ
విశ్వాసం
వ్యక్తం
చేసింది.