అనైతిక శృంగారం, వేధింపులు భరించలేను, విడాకులిస్తా: మహిళ సంచలనం
భర్తతో పాటు ఆయన కుటుంబసభ్యులు పెట్టే వేధింపులు భరించలేక తానే విడాకులు ఇస్తానని ఓ వివాహిత ప్రకటించింది. తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ లు చెబుతూ విడాకులు ఇస్తున్న ఈ సందర్భంలో ఓ బార్యే తానే తన భర్తకు విడాకు
మీరట్: భర్తతో పాటు ఆయన కుటుంబసభ్యులు పెట్టే వేధింపులు భరించలేక తానే విడాకులు ఇస్తానని ఓ వివాహిత ప్రకటించింది. తమ భార్యలకు ట్రిపుల్ తలాక్ లు చెబుతూ విడాకులు ఇస్తున్న ఈ సందర్భంలో ఓ బార్యే తానే తన భర్తకు విడాకులు ఇస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన అమ్రీన్ బానో అనే సాబీర్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకొంది. పెళ్ళి చేసుకొన్ననాటి నుండి భర్త అతడి సోదరుడు, కుటుంబసభ్యులు హింసిస్తున్నారని బాధితురాలు చెబుతోంది.
అమ్రీన్ సాబీర్ ను పెళ్ళి చేసుకోగా, ఆమె సోదరి ఫర్హీన్ తనభర్త సోదరుడు షకీర్ ను పెళ్ళిచేసుకొంది.అతడి సోదరుడు అయితే వీరిద్దరి పరిస్థితి ప్రతిరోజూ ఆ సోదరులు పెట్టే వేధింపులు భరించలేకపోతున్నారు.
ఫర్హీన్ భర్తను ఒకసారి అమ్రీన్ కుమారుడు కేవలం ఐదు రూపాయాలు అడిగినందుకు ఆ బాలుడిపై చేయిచేసుకొన్నాడు. అమ్రీన్ ను , ఫర్హీన్ ను చావుదెబ్బలు కొట్టాడు. అదే సమయంలో ఇంటికెళ్ళి రూ.5 లక్షలు తీసుకురావాలంటూ గొడవ చేశాడు.
అంతటితో ఆగకుండా ఫర్హీన్ కు మూడుసార్లు తలాక్ చెప్పేసి ఇంట్లో నుండి వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఆమ్రీన్ భర్త కూడ అదే పనిచేశాడు. దీంతో ఆమె ఆగ్రహంతో పుట్టింటికి వెళ్ళిపోయింది.
ట్రిపుల్ తలాక్ పై దే శవ్యాప్తంగా చర్చ సాగుతోంది.అదే సమయంలో అమ్రీన్ ఈ విషయమై ధైర్యంగా బయటకు వచ్చింది. తన భర్తకు తానే విడాకులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.తమను భౌతికంగా హింసించడమే కాకుండా అనైతిక శృంగార కార్యక్రమాలకు ఆ ఇద్దరు సోదరులు పాల్పడేవారంటూ ఆమె తన గోడును వెళ్ళబోసుకొంది. ఈ మేరకు వారిద్దరూ సోదరిలు పోలీసులకు ఫిర్యాదుచేశారు. తామే వారికి శిక్ష వేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.అయితే తామే వారికి విదాకులు ఇస్తామంటున్నారు.