ప్రధాని ‘మోడీ’ పేరు వాడుకుంటూ మోసాలు: సీబీఐ కేసు
ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరునే వాడుతూ.. ఓ వెబ్సైట్ను సృష్టించి ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది.
న్యూఢిల్లీ: ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరునే వాడుతూ.. ఓ వెబ్సైట్ను సృష్టించి ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నరేంద్ర మోడీ కంప్యూటర్ సాక్షారత మిషన్ (ఎన్ఎమ్సీఎస్ఎమ్) పేరుతో ఓ నకిలీ సంస్థ ప్రజలను మోసగిస్తోందని గుర్తించింది ప్రధాని కార్యాలయం.
వెంటనే ఈ విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఉత్తర్ప్రదేశ్కు చెందిన అతుల్కుమార్, జగ్మోహన్సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ వెబ్సైట్ను రూపొందించారని.. వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.
వివిధ కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని.. అడ్మిషన్లు, ఫ్రాంచైజీల కోసం నమోదు చేసుకోవచ్చని వారు వెబ్సైట్లో పేర్కొన్నారని వివరించారు. ఇందు కోసం డీడీల రూపంలో డబ్బును వసూలు చేసేందుకు కుట్ర పన్నినట్లు తెలిపారు.