'పాకిస్థాన్ కీ జై, చైనా కీ జై అంటారా?': వెళ్లిపోవచ్చని ఫడ్నవీస్
ముంబై : 'భారత్ మాతా కీ జై' నినాదం అంశంపై తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇక్కడ బతకాలని అనుకుంటే 'భారత్ మాతా కీ జై' అని అనాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ నినాదం చేయనివాళ్లకు దేశంలో నివసించే హక్కు లేదని తేల్చిచెప్పారు. 'భారత్ మాతా కీ జై అనకపోతే మరేమంటారు? పాకిస్తాన్ కీ జై, చైనా కీ జై అంటారా' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయంపై దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 'ఒక్కసారి ముంబైలోని మజార్ ప్రాంతానికి వెళ్లి చూడండి. ఎంతమంది ముస్లిం మత పెద్దలు భారత్ మాతా కీ జై నినాదాన్ని పఠిస్తుంటారో తెలుస్తుంది' అంటూ చెప్పుకొచ్చారు.
కాగా, ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో మరోసారి దుమారం రేగింది. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ.. ఫడ్నవీస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని అన్నారు.
బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసేముందు ఆలోచించాలన్నారు. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కోక తప్పదని తెలిపారు. మరోవైపు, మరికొందరు ముస్లింలు భారత్ మాతాకీ జై అనడంలో తప్పేమీ లేదని పేర్కొంటున్నారు.
కాగా, ముస్లింలు 'భారత్ మాతా కీ జై' అంటూ నినదించడంపై ఉత్తర్ప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలోని దారుల్ ఉలూమ్ దేవ్బంద్ వర్సిటీ శుక్రవారం ఫత్వా జారీచేసిన విషయం తెలిసిందే. అలా నినదించడం విగ్రహారాధన కిందకు వస్తుందని, ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.
Some people say we will not say Bharat Mata ki Jai. Then what? Pakistan ki jai or China ki jai?-CM Devendra Fadnavis pic.twitter.com/dG5LPzVllS
— ANI (@ANI_news) April 3, 2016
There was no need to issue a fatwa against 'Bharat Mata ki Jai' slogan,we condemn it-Maulana Khalid Rasheed pic.twitter.com/UB9p3DeI2S
— ANI (@ANI_news) April 3, 2016
Went to a Mazar in Mumbai, hundreds of Muslim priests chanted Bharat Mata ki Jai.Those who say Bharat ke tukde honge will fail-CM Fadnavis
— ANI (@ANI_news) April 3, 2016