లాక్డౌన్ కారణంగా అన్ని సంస్థలు నష్టాలు..మెడికేర్కు మాత్రం భారీగా లాభాలు
కోవిడ్ 19 వల్ల ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. భారత్ లోనూ లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు పూర్తిగా స్థంభించాయి. స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అంతటా స్తబ్ధత నెలకొన్న వేళ, చీకటిలో చిరు దివ్వెలా మెడికవర్ సంస్థ 12,00 కోట్ల రూపాయల లాభంతో విజయపథంలో దూసుకుపోతోంది.
మెడికవర్ బోర్డ్ ఏప్రిల్ 30న నిర్వహించిన సభలో ఈ మేరకు ఆథరైజేషన్కు అనుమతులు ఇవ్వగా, ఇటీవలే విడుదలైన ప్రెస్ రిలీజ్లో సంస్థ డైరెక్టెడ్ షేర్ ఇష్యూ ద్వారా 100 స్వీడిష్ డాలర్లు విలువ గల 1500 మిలియన్ల కొత్త క్లాస్ బీ షేర్లు సబ్ స్క్రిప్షన్లు లభించడంతో, సంస్థ 1200 కోట్ల రూపాయిల గడించిందని తెలుస్తోంది. AP4 వంటి అంతర్జాతీయ పెట్టుబడి దారులు పెద్ద ఎత్తున డైరెక్టెడ్ షేర్ ఇష్యూలో పాలుపంచుకున్నాయని తెలుస్తోంది.
మెడికవర్ సంస్థ సీఈఓ ఫెడ్రిక్ రాగ్మార్క్ మాట్లాడుతూ, స్వీడన్ తో పాటూ, ఇతర అంతర్జాతీయ పెట్టుబడిదారులు తమపై ఉంచిన నమ్మకానికి, ఇచ్చిన మద్దతుకు రుణపడి ఉంటామని ప్రకటించారు. ఈ నికరలాభం ద్వారా తమ ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు.
ఇకపై వచ్చిన అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవడంపై దృష్టిపెడతామని, షేర్ హోల్డర్ల నమ్మకాన్ని అలానే నిలుపుకుంటామని వెల్లడించారు.