మలయాళంతో కేరళను ఫ్లాట్ చేసి, పరుగెత్తించిన సచిన్! (పిక్చర్స్)
తిరువనంతపురం/ముంబై: జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు కేరళలో జరగనున్న 35వ జాతీయ క్రీడల ప్రమోషన్ ఈవెంట్ కోసం భారతరత్న, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ తిరువనంతపురం వచ్చారు.
ప్రమోషన్ కోసం మంగళవారం నాడు రన్ కేరళ రన్ నిర్వహించారు. దీనిని సచిన్ ప్రారంభించారు. ఈ రన్ కేరళ రన్ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. దీంతో తిరువనంతపురం వీధులు కిక్కిరిసిపోయాయి.
రన్ కేరళ రన్ కోసం 21 మెగా పాయింట్స్, 226 మినీ మెగా పాయింట్స్, పదివేల ఆర్డినరీ పాయింట్స్ను ఏర్పాటు చేశారు.
రన్ కేరళ రన్
జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు కేరళలో జరగనున్న 35వ జాతీయ క్రీడల ప్రమోషన్ ఈవెంట్ కోసం భారతరత్న, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండుల్కర్ తిరువనంతపురం వచ్చారు. ప్రమోషన్ కోసం మంగళవారం నాడు రన్ కేరళ రన్ నిర్వహించారు. దీనిని సచిన్ ప్రారంభించారు.
రన్ కేరళ రన్
ఈ రన్ కేరళ రన్ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు. దీంతో తిరువనంతపురం వీధులు కిక్కిరిసిపోయాయి. రన్ కేరళ రన్ కోసం 21 మెగా పాయింట్స్, 226 మినీ మెగా పాయింట్స్, పదివేల ఆర్డినరీ పాయింట్స్ను ఏర్పాటు చేశారు.
రన్ కేరళ రన్
ఈ రన్ కేరళ రన్ తిరువనంతపురం, కొచ్చి తదితర ప్రాంతాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా సచిన్ టెండుల్కర్, నటుడు మోహన్ లాల్ నిలిచారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతు, పెద్దవారు, చిన్నవారు దాదాపు అందరు పాల్గొన్నారు.
రన్ కేరళ రన్
సచిన్తో పాటు ముఖ్యమంత్రి ఊమన్ చాందీ, క్రీడాశాఖ మంత్రి తిరువంచూర్ రాధాకృష్ణన్, హోంమంత్రి రమేష్ చెన్నితాల, పారిశ్రామిక మంత్రి పీకే కున్హాలికుట్టీ, పవర్ మినిస్టర్ ఆర్యదాన్ మహమ్మద్, సభాపతి కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు.
రన్ కేరళ రన్
సచిన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని ఆపేందుకు పోలీసులు శ్రమించవలసి వచ్చింది. సచిన్ మలయాళంలో మాట్లాడుతూ అందర్నీ ఉత్సాహపరిచారు. నమస్కారం అంటూ పలకరించారు.
రన్ కేరళ రన్
కేరళకు తన హృదయంలో ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుందని, అందరు కూడా ఈ నేషనల్ గేమ్స్కు విజయవంతం చేయాలని, కేరళ బ్లాస్టర్స్కు మద్దతివ్వాలని చెప్పారు.