బెంగళూరులో లైవ్ బ్యాండ్ అమ్మాయిలు, హైటెక్ వ్యభిచారం, రెచ్చిపో, విటులకు వల!
బెంగళూరు: లైవ్ బ్యాండ్ లో పని చేస్తున్న అమ్మాయిలతో హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్న లైవ్ బ్యాండ్ యజమానిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి పిలుచుకుని వచ్చిన అందమైన అమ్మాయిలతో మించు (రెచ్చిపో) అనే పేరుతో లైవ్ బ్యాండ్ నిర్వహిస్తున్నారని, హైటెక్ వేశ్యవాటిక నిర్వహకులను అరెస్టు చేశామని సీసీబీ పోలీసులు తెలిపారు.
అమ్మి ఇంటర్నేషనల్ ఇన్ హోటల్
బెంగళూరు నగరంలోని మెజస్టిక్ సమీపంలోని అమ్మి ఇంటర్నేషనల్ ఇన్ హోటల్ మీద దాడి చేసిన సీసీబీ పోలీసులు లైవ్ బ్యాండ్ యజమాని డిఎస్. లక్ష్మణ్ తో పాటు శివరాజు, హోటల్ మేనేజర్ బీఎల్. రవికుమార్ అనే నిందితులను అరెస్టు చేశారు.
లైవ్ బ్యాండ్ అమ్మాయిలు
మెజస్టిక్ సమీపంలోని అమ్మి ఇంటర్నేషనల్ ఇన్ హోటల్ లో రూంలు బుక్ చేసుకుని అక్కడికి లైవ్ బ్యాండ్ అమ్మాయిలను తీసుకువచ్చి విటులను ఆకర్షించి అక్కడికి పిలుచుకుని వచ్చి హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.
మించు లైవ్ బ్యాండ్
నిందితుడు లక్ష్మణ్ మెజస్టిక్ సమీపంలోని గాంధీనగర్ లో మించు (రెచ్చిపో) అనే లైవ్ బ్యాండ్ నిర్వహిస్తున్నాడు. ఇతర రాష్ట్రాలకు చెందిన అందమైన అమ్మాయిలకు మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి బెంగళూరు తీసుకు వచ్చి లైవ్ బ్యాండ్ లో పని చెయ్యాలని బలవంతం చేశాడని పోలీసులు అన్నారు.
గత్యంతరం లేదు
వేరే గత్యంతరం లేక లైవ్ బ్యాండ్ లో అమ్మాయిలు పని చేస్తున్నారు. లైవ్ బ్యాండ్ లో పని చేస్తున్న అమ్మాయిలకు ఎక్కువ నగదు ఆశ చూపి హైటెక్ వేశ్యవాటిక కేంద్ర నిర్వహిస్తున్నారు. నిందితుడు లక్ష్మణ్ అమ్మి ఇంటర్నేషనల్ ఇన్ హోటల్ మేనేజర్ రవికుమార్ తో కుమ్మక్కు అయ్యాడని పోలీసులు చెప్పారు.
లైవ్ బ్యాండ్ గర్ల్స్ సేఫ్
హోటల్ లో రూంలు బుక్ చేసి బయట నుంచి విటులను తీసుకువచ్చి హైటెక్ వేశ్వవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని సీసీబీ పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు అమ్మాయిలను రక్షించి రెండు కార్లు, రూ. 28 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు సీసీబీ పోలీసులు తెలిపారు.