వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: ప్రేమించనందుకు, ముగ్గురు దళిత బాలికల హత్య చేశారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

దేవరియా: ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు దళిత బాలికలు శనివారం దారణ హత్యకు గురయ్యారు. స్ధానిక కటియరి గ్రామ సమీపంలో ముగ్గురి మృతదేహాలు కనిపించాగా, వారిని ప్రీతి (9), పింకీ (13), ఇందు (18)లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు సంబంధించిన మిస్టరీని ఆదివారం పోలీసులు చేధించారు.

ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ధీరజ్ అనే యువకుడు ఇందుని ప్రేమించగా అందుకు ఆమె అంగీకరించలేదని పేర్కొన్నాడు. ఆమె తన ప్రేమను అంగీకరించకపోవడంతో సోను, అమ్రేష్, రాజ్ కోకిల్ అనే వారితో కలిసి ధీరజ్ ఆమెను హత్య చేశాడని తెలిపారు.

Three Dalit girls found murdered in Deoria

ఎలాంటి సాక్ష్యాధారులు లేకుండా అడ్డు తొలగించుకునేందుకు పింకీ, ప్రీతిలను సైతం చంపేశారని పోలీసులు పేర్కొన్నారు. రాజ్ కోకిల్, సోనులు పరారీలో ఉన్నారని తెలిపారు. అయితే బాలికలపై లైంగిక దాడి జరిగిందనడానికి పోస్ట్ మార్టం నివేదికలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

మృతుల కుటుంబ సభ్యలను జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పూనియా పరామర్శించారు. ఈ హత్యలపై స్వతంత్ర సంస్ధతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

English summary
Three Dalit girls, who had been missing since Friday, were found murdered in a field in Barhaj area of Uttar Pradesh’s Deoria district Saturday, a police official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X