దారుణం: ప్రేమించనందుకు, ముగ్గురు దళిత బాలికల హత్య చేశారు
దేవరియా: ఉత్తరప్రదేశ్లో ముగ్గురు దళిత బాలికలు శనివారం దారణ హత్యకు గురయ్యారు. స్ధానిక కటియరి గ్రామ సమీపంలో ముగ్గురి మృతదేహాలు కనిపించాగా, వారిని ప్రీతి (9), పింకీ (13), ఇందు (18)లుగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యలకు సంబంధించిన మిస్టరీని ఆదివారం పోలీసులు చేధించారు.
ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ధీరజ్ అనే యువకుడు ఇందుని ప్రేమించగా అందుకు ఆమె అంగీకరించలేదని పేర్కొన్నాడు. ఆమె తన ప్రేమను అంగీకరించకపోవడంతో సోను, అమ్రేష్, రాజ్ కోకిల్ అనే వారితో కలిసి ధీరజ్ ఆమెను హత్య చేశాడని తెలిపారు.
ఎలాంటి సాక్ష్యాధారులు లేకుండా అడ్డు తొలగించుకునేందుకు పింకీ, ప్రీతిలను సైతం చంపేశారని పోలీసులు పేర్కొన్నారు. రాజ్ కోకిల్, సోనులు పరారీలో ఉన్నారని తెలిపారు. అయితే బాలికలపై లైంగిక దాడి జరిగిందనడానికి పోస్ట్ మార్టం నివేదికలో ఎలాంటి ఆధారాలు లేవన్నారు.
మృతుల కుటుంబ సభ్యలను జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పూనియా పరామర్శించారు. ఈ హత్యలపై స్వతంత్ర సంస్ధతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.