సింథటిక్ పాల ఉత్పత్తి కేంద్రాలపై పోలీసుల దాడులు....ఆరు రాష్ట్రాల్లో సింథటిక్ పాల పంపిణి
మధ్యప్రదేశ్లో చిన్నపిల్లల నుండి పెద్దలు తాగే పాలను కల్తి చేస్తున్న ముఠాను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ,చంబల్ రిజియన్ ప్రాంతాంలో నిర్వహిస్తున్న పాల కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. ఈనేపథ్యంలోనే టాక్సిక్ పదార్థాలతో తయారు చేస్తున్న మూడు సింథటిక్ పాల కేంద్రాలపై దాడులు చేసి సుమారు 60 మంది వరకు అరెస్ట్ చేశారు.కాగా ఈ పాలను ఆరు రాష్ట్రాల్లో పంపీణి చేస్తారని పోలీసులు తెలిపారు.
కాగా దాడుల్లో భాగంగా 10వేల లీటర్లను 200 కిలోల సింథటిక్ పన్నీర్ను పట్టుకున్నారు, లిక్విడ్ డిజర్జంట్, రిఫైండ్ అయిల్, మరియు గ్లూకోజ్, వీటితోపాటు మరో 20 పాల ట్యాంకర్లు,11 వ్యాన్లను సీజ్ చేశారు. కాగా మూడు యూనిట్లలో ముప్పై శాతం మేర పాలలో లిక్విడ్స్ కలిపి పాలను తయారు చేస్తారని ఇందుకోసం ఓక్కో లీటరుకు 5 రుపాయాలు ఖర్చు అవుతుందని కాని దీన్ని మార్కెట్ లో 45 రుపాయాలకు లీటరు చోప్పున అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు..
కాగా సింథటిక్ పాలను దేశంలోని మధ్యప్రదేశ్తో పాటు ,ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ,హర్యాణ, మహారాష్ట్రల్లో ఈ పాలను అమ్ముతున్నట్టు తెలిపారు.ఇందుకోసం మూడు యూనిట్లు కూడ ఇరవైనాలుగు గంటలు కూడ పాలను ఉత్పత్తి చేస్తాయని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు.