వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన జవాన్లు: ఆ తీవ్రవాద సంస్థకు వెన్ను విరిగినట్టే: 5 గంటలుగా.. !

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట నుంచి ఏకధాటిగా సంభవించిన ఎదురు కాల్పుల సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, ఏకే-56, తుపాకులు, హ్యాండ్ గ్రనేడ్లు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సందడిగా విశాఖ ఎయిర్‌పోర్ట్: చైనా నుంచి స్వరాష్ట్రానికి తెలుగువారు: కరోనా వైరస్ నెగెటివ్‌గా తేలడంతో..సందడిగా విశాఖ ఎయిర్‌పోర్ట్: చైనా నుంచి స్వరాష్ట్రానికి తెలుగువారు: కరోనా వైరస్ నెగెటివ్‌గా తేలడంతో..

ఈ ఎన్‌కౌంటర్‌లో జహంగీర్ రఫిక్ వణి, రజా ఉమర్ మక్బూల్, ఉజైర్ అమీన్ బట్ అనే ఉగ్రవాదులు హతమైనట్లు ధృవీకించారు. ఈ ముగ్గురూ అన్సర్ ఘజ్వా ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలో పని చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్‌ను కేంద్రంగా చేసుకుని తరచూ ఉగ్రవాద దాడులకు పాల్పడుతోందని, ఇదివరకు కొందరు స్థానికులు, పోలీసులను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

Three militants killed in encounter with security forces in Tral sector of Pulwama

Recommended Video

Suspended DSP Davinder Singh brought to NIA court in Jammu | Oneindia Telugu

త్రాల్ సెక్టార్ పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్‌ను నిర్వహిస్తుండగా.. ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలోఈ ముగ్గరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరి కొంతమంది ఉండొచ్చనే అనుమానంతో త్రాల్ సెక్టార్‌ను జల్లెడ పడుతున్నారు.

English summary
The three terrorists killed in encounter in an operation by the Army, CRPF and Jammu and Kashmir Police in Tral of Pulwama district. Terrorist have been identified as Jangeer Rafiq Wani, Raja Umar Maqbool Bhat and Uzair Amin Bhat. All 3 terrorists belong to the terror outfit 'Ansar Ghazwa ul Hind'. At least three militants were killed in an encounter with security forces in Pulwama district of Jammu and Kashmir, police officials said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X