ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన జవాన్లు: ఆ తీవ్రవాద సంస్థకు వెన్ను విరిగినట్టే: 5 గంటలుగా.. !
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా త్రాల్ సెక్టార్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటిగంట నుంచి ఏకధాటిగా సంభవించిన ఎదురు కాల్పుల సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూ కాశ్మీర్ పోలీసు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి ఏకే-47, ఏకే-56, తుపాకులు, హ్యాండ్ గ్రనేడ్లు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సందడిగా విశాఖ ఎయిర్పోర్ట్: చైనా నుంచి స్వరాష్ట్రానికి తెలుగువారు: కరోనా వైరస్ నెగెటివ్గా తేలడంతో..
ఈ ఎన్కౌంటర్లో జహంగీర్ రఫిక్ వణి, రజా ఉమర్ మక్బూల్, ఉజైర్ అమీన్ బట్ అనే ఉగ్రవాదులు హతమైనట్లు ధృవీకించారు. ఈ ముగ్గురూ అన్సర్ ఘజ్వా ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలో పని చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ సంస్థ జమ్మూ కాశ్మీర్ను కేంద్రంగా చేసుకుని తరచూ ఉగ్రవాద దాడులకు పాల్పడుతోందని, ఇదివరకు కొందరు స్థానికులు, పోలీసులను కాల్చి చంపిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.
Recommended Video
త్రాల్ సెక్టార్ పరిధిలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ను నిర్వహిస్తుండగా.. ఈ ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఆర్మీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలోఈ ముగ్గరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరి కొంతమంది ఉండొచ్చనే అనుమానంతో త్రాల్ సెక్టార్ను జల్లెడ పడుతున్నారు.