చిన్నమ్మకు షాక్ : ముగ్గురు ఎంపిలు పన్నీర్ గూటికి, మంత్రులు అదే దారిలో?
తమిళనాడులో పన్నీర్ సెల్వం బలం రోజురోజుకు పెరుగుతోంది. శశికళ వర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరుగా పన్నీర్ సెల్వం గ్రూపులోకి చేరుతున్నారు.ఎంపిలు ఏడుగురు పన్నీర్ గూటికి చేరుకొన్నారు.
తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బలం రోజురోజుకు పెరుగుతోంది. ఎంఏల్ఏలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు పన్నీర్ సెల్వం
గ్రూపులో చేరుతున్నారు. మరో ముగ్గురు మంత్రులు కూడ పన్నీర్ సెల్వం గ్రూప్ లోకి జంప్ చేసేందుకు రడీగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.అయితే తనవర్గం నుండి ఎంఏల్ఏలను జారిపోకుండా ఉండేందుకు శశికళ సర్వశక్తులను ఒడ్డుతోంది.తాజాగా మరో ముగ్గురు ఎంపిలు కూడ పన్నీర్ సెల్వం గ్రూప్ లో చేరారు. దీంతో పన్నీర్ వైపుకు వచ్చిన ఎంపిల సంఖ్య ఏడుకు చేరింది.
తమిళనాడులో అన్నాడిఎంకె శాసనసభపక్ష నాయకురాలిగా శశికళ ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం చిన్నమ్మ వెంటే ఉన్నట్టు కన్పించారు.
ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణస్వీకారం చేసేందుకు గవర్నర్ నుండి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సెల్వం కూడ చక్రం తిప్పుతున్నారు.
అమ్మ సమాధి వద్దే శశికళపై విమర్శలను గుప్పించారు. బలవంతంగా తనతో రాజీనామా చేయించారని ఆరోపించారు. అన్నాడిఎంకె శశికళ, పన్నీర్ సెల్వం గ్రూపులుగా విడిపోయింది.