బిజెపికి షాక్ : గోవాలో కొత్త కూటమి,చరిత్ర సృష్టించేనా?
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఎంజిపి, జిఎస్ ఎం, శివసేన పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయం తీసుకొన్నాయి.ఈ నిర్ణయం బిజెపికి రాజకీయంగా నష్టం కల్గించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గోవా :ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరుణంలో గోవాలో రాజకీయ సమీకరణాలు మారాయి. అధికార బిజెపికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీతో పొత్తు కొనసాగిస్తూ వచ్చిన మహరాష్ట్ర గోమంతక్ పార్టీ కొత్త కూటమిని ఏర్పాటుచేసింది. ఈ కూటమిలో మూడు పార్టీలున్నాయి. ఈ మూడు పార్టీల కూటమి కలిసి పోటీచేయనున్నట్టు ప్రకటించాయి.
గోవాలో బిజెపి అధికారంలో ఉంది. అయితే బిజెపితో కలిసి అధికారాన్ని పంచుకొన్న గోమంతక్ పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకొంది. శివసేన, గో సురక్ష మంచ్ తో కలిసి కూటమిని ఏర్పాటుచేసింది. ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేయనున్నట్టు ప్రకటించాయి.
ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేయాలని ప్రకటించడం బిజెపికి షాక్ కల్గించింది. ఈ పరిణామం కొంత బిజెపికి రాజకీయంగా కొంత నష్టం కల్గించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బిజెపితో పొత్తును ఉపసంహరించుకొంటున్నట్టు ఎంజిపి ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకుడు ఆ రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాశాడు.
షెడ్యూట్ విడుదలయ్యాక బిజెపి దూరమైన ఎంజిపి
ఈ నెల 4వ, తేదిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమీషన్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ విడుదలైన మరునాడే గోవాలో బిజెపి ప్రభుత్వానికి తమ పార్టీ మద్దతును ఉపసంహరించుకొంటుందని మహరాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజిపి) ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల ఐదవ తేదినే ఆ రాష్ట్ర గవర్నర్ కు లేఖ రాసింది ఆ పార్టీ. 2012 లో జరిగిన ఎన్నికల్లో బిజెపి, ఎంజిపిలు కలిసి పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో బిజెపి 21 స్థానాల్లో ఎంజిపి మూడు స్థానాల్లో విజయం సాధించాయి.
మూడు పార్టీల కూటమి పోటీకి సిద్దం
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేసేందుకు సన్నద్దమయ్యాయి.ఈ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనేందుకు గాను ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. శివసేన, గో సురక్ష, మహరాష్ట్రవాది గోమంతక్ పార్టీలు కూటమిగా పోటీచేయనున్నాయి. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేయడంతో బిజెపికి కొంత నష్టం కలిగే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బిజెపి పై ఎంజిపి విమర్శలు
గోవా రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వంతో ఎంజిపి భాగస్వామ్యపార్టీగా ఉంది.అయితే బిజెపి తీరును ఎంజిపి తప్పుబడుతోంది.సంకీర్ణ ధర్మాన్ని ఆ పార్టీ నెరవేర్చడం లేదని ఎంజిపి ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బిజెపికి మద్దతును ఉపసంహరించుకొన్నట్టు ఆ పార్టీ చెబుతోంది. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ నిర్ణయం వెలువరచడం రాజకీయంగా విమర్శలు చేసేందుకే ఈ రకమైన ఆరోపణలను ఎంజిపి చేస్తోందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఈ కూటమి ప్రభావం చూపేనా?
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఉన్న పరిస్థితుల ప్రకారంగా బిజెపికి అనుకూలమైన వాతావరణమే ఉందని సర్వేలు చెబుతున్నాయి.అయితే ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేస్తున్నందున తక్కువగా అంచనాకూడ వేయలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఈ మూడు పార్టీలు ప్రభావం చూపగలిగితే బిజెపికి కొంత నస్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని ఆపార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.