వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే.. సెల్ఫీలు తీసుకున్నారు! ముగ్గురి మృతికి కారణమయ్యారు

|
Google Oneindia TeluguNews

జోధ్‌పూర్‌: సెల్ఫీల మోజుతో కొందరు తమ ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొందరు వాటి మోజులో పడి ఇతరుల ప్రాణాలు కూడా తీస్తుండటం విచారకరం. రహదారి ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా.. కాపాడాల్సిన ఓ యువకుడు అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ నిల్చుకున్నాడు.

 Three people die in accident as onlookers take selfies

ఘటనా స్థలానికి చేరుకొన్న మరికొందరు స్థానికులు కూడా వారిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అక్కడే ఫొటోలు తీసుకుంటూ తచ్చాడారు. వారి నిర్లక్ష్యంతో ముగ్గురు క్షతగాత్రులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే ప్రాణాలు నిలిచేవని పోలీసులు తెలిపారు.

ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన పర్మానంద్‌, చంద్రారామ్‌, జమారాం అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. వారంతా లేబర్ కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు.

English summary
Three persons, who met with an accident here, died after writhing in pain for nearly thirty minutes even as a group of onlookers clicked selfies and made videos with no one coming forward to the help of the injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X