వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంచుచరియలు విరిగిపడి ముగ్గురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో మంచుకొండ చరియలు విరిగిపడటంతో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. శుక్రవారం మచిల్ సెక్టార్, ఉత్తర కాశ్మీర్, కుప్వార జిల్లాలోని ఆర్మీక్యాంప్పై కొండ చరియలు విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. బుధవారం ఆఫ్ఘనిస్థాన్- తజకిస్తాన్ సరిహద్దుల్లో భూమి కంపించడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర కాశ్మీర్లోని పలు జిల్లాలకు గువారమే ముందస్తు హెచ్చరిక జారీ చేశారు.
Comments
English summary
Three Army personnel lost their lives and one person was injured, after an avalanche hit an Army post in Kupwara's Machil Sector in Jammu and Kashmir on Friday.
Story first published: Friday, February 2, 2018, 22:36 [IST]