వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడి ఆరుగురు మృత్యువాత

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ఒరిస్సా: క్రికెట్ మైదానంలో పిడుగుపడి ఆరుగురు మృత్యువాత పడిన ఘటన ఒడిశాలోని కుర్దా జిల్లాలోని జరిపాద గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, గ్రామంలోని యవకులు రెండు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడుకుంటుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం పడింది.

దీంతో యువకులు సమీపంలోని ఓ ఇంటి వద్దకు వెళ్లి తలదాచుకున్నారు. అదే సమయంలో యువకులు ఉన్న ఇంటిపై పిడుగు పడింది. ఒక్కసారిగా పడిన పిడుగుతో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Thunderbolt in orissa cricket field: 6 people dead

గాయపడిన వారిని కుర్దాలోని తంగి ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం భువనేశ్వర్ తరలించారు. వీరిలో ఒకరి పరిస్ధితి విషమంగా ఉంది. ఇది ఇలా ఉంటే ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.

English summary
Today in Orissa state cricket field thunderbolt happend, In this incident total 6 people dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X