వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం: ఉప ఎన్నికలపై అఖిలేష్ యాదవ్
లక్నో: కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయని ఎస్పీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ గురువారం అన్నారు. ఈవీఎంలలో సమస్యల రాకపోయి ఉంటే ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మరింత మెజార్టీ వచ్చి ఉండేదన్నారు.
చదవండి: గుణపాఠం, అతివిశ్వాసం: ఓటమిపై యోగి, మాయ - అఖిలేష్ ఇప్పుడు దెబ్బకొట్టారు సరే
కొన్ని ఈవీఎంలల్లో ముందుగానే ఓట్లు వేశారని, ఈవీఎం యంత్రాల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే బాగుంటుందిన్నారు. అప్పుడు ప్రజలు ఓట్ల ద్వారా తమ ఆగ్రహాన్ని చూపించగలుగుతారన్నారు.
కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలే ఉన్నాయన్నారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయనే దానిపై వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.
భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఎవరికీ తెలియదని, దాని గురించి ఇప్పుడేమీ మాట్లడనని, కాంగ్రెస్తో తమ సంబంధాలు బాగున్నాయన్నారు.
Comments
uttar pradesh narendra modi yogi adityanath bjp sp bsp mayawati akhilesh yadav by elections gorakhpur ఉత్తర ప్రదేశ్ నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ఎస్పీ బీఎస్పీ మాయావతి అఖిలేష్ యాదవ్ ఉప ఎన్నికలు గోరక్పూర్
English summary
Samajwadi Party chief Akhilesh Yadav on Thursday said his ties with the Congress will continue to be good but stopped short of saying if the two parties will fight the 2019 Lok Sabha elections together.
Story first published: Thursday, March 15, 2018, 22:22 [IST]