వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘మనుషులను శిక్షించినప్పుడు.. ఆవులను తినే పులులను కూడా శిక్షించాలి’

|
Google Oneindia TeluguNews

పనాజీ: మనుషలను శిక్షించినప్పుడు.. ఆవులను తినే పులులను కూడా శిక్షించాల్సిందేనని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎమ్మెల్యే చర్చిల్ అలెమావో వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన గోవా అసెంబ్లీ సమావేశంలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.

నెల రోజుల క్రితం మహాదాయి వైల్డ్‌లైఫ్ శాంక్షుయరీలో ఓ పులి, దాని మూడు పిల్లలను స్థానికులు చంపేశారు. ఓ రైతు ఇంట్లోని ఆవును పులి చంపి తినడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఓ పులి, దాని మూడు పిల్లలను చంపేయడం జరిగింది. కాగా, బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత, విపక్ష నేత దిగంబర్ కామత్ ఈ విషయాన్ని లేవనెత్తారు.

 Tigers must be punished for eating cows: Goa NCP MLA Churchill Alemao

సభలో అటెన్షన్ మోషన్‌కు పట్టుబట్టారు. దీనిపై స్పందించిన సీఎం ప్రమోద్ సావంత్.. పులులు తమ ఇళ్లపై దాడి చేయడంతో ప్రజలు వాటిని చంపారని అన్నారు. తమ ఆవులను కోల్పోయిన రైతులకు త్వరలోనే నష్ట పరిహారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

కాగా, వన్య జీవుల కోణంలో చూస్తే పులులు ఎంత ముఖ్యమో.. రైతులకు ఆవులు కూడా అంతే ముఖ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చర్చిల్ వ్యాఖ్యానించారు. ఆవుల్ని చంపి తింటే మనుషులకు శిక్ష వేసినప్పుడు అదే పని చసిన పులులకు ఎలాంటి శిక్ష వేస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో మానవీయ కోణంలో చూడాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
Even as the issue of tiger killings was discussed in the Goa Assembly on Wednesday, Nationalist Congress Party (NCP) MLA Churchill Alemao said that tigers should be "punished" for eating cows when humans are punished for the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X