రేపే ఉరి: మెమన్ కేసులో ఎప్పుడేం జరిగింది?
ముంబై: తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి యాకుబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు త్రిసభ్య బెంచ్ బుధవారం కొట్టేసింది. దీంతో రేపు (జులై 30) గురువాడం మహారాష్ట్రలోని నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది.
గురువారం ఉదయం 7 గంటల్లోగా అతడిని మహారాష్ట్రలోని నాగ్ పూర్ జైల్లో ఉరి తీయనున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 7 గంటల్లోగా ఏ సమయంలోనైనా ఈ శిక్షను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. టాడా కోర్టు జారీచేసిన డెత్ వారంట్ను సుప్రీంకోర్టు సమర్థించింది.
దీంతో ఆ వారెంట్ చెల్లుబాటు అవుతుందని జైలు వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రపతి గతంలో క్షమాభిక్షను తిరస్కరించిన తర్వాత, దాన్ని 14 రోజుల్లోగా కోర్టులో సవాలు చేయాల్సి ఉండగా మెమన్ అలా చేయలేదని సుప్రీం త్రిసభ్య బెంచ్ బుధవారం తెలిపింది.
ప్రస్తుతం యాకుబ్ మెమన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్నాడు. రేపు (జులై 30)న అక్కడే ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఇదే గనుక జరిగితే, 257 మంది ప్రాణాలను బలిగొన్న ముంబై వరుస పేలుళ్ల కేసులో తొలి ఉరి యాకుబ్ మెమన్దే. యాకుబ్ మెమన్ ఉరిశిక్ష నేపథ్యంలో నాగపూర్ జైలు వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
జైలు పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ను ప్రకటించారు. జైలు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక దళాలను మహారాష్ట్ర ప్రభుత్వం మొహరించింది. ముంబైలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. మహారాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి ఫడ్నవీస్, డీజీపీ సమీక్ష నిర్వహించారు.
1993
ముంబై
వరుస
పేలుళ్ల
సంఘటనకు
సంబంధించిన
టైమ్లైన్:
1993
మార్చి
12:
నిమిషాల
వ్యవధిలోనే
ముంబైలో
13
వరుస
పేలుళ్లు.
257
మంది
మృతి.
1993
నవంబర్
4:
189
మంది
నిందితులపై
దాదాపు
10వేల
పేజీల
చార్జిషీటు
దాఖలు.
1995
ఏప్రిల్
10:
26మంది
నిందితులను
విడుదల
చేసిన
టాడా
కోర్టు
2001
జూలై18:
684మంది
సాక్షుల
స్టేట్మెంట్ల
రికార్డు
పూర్తి
2003
సెప్టెంబర్:
పూర్తయిన
విచారణ..
రిజర్వులో
తీర్పు
2006
సెప్టెంబర్
12:
తీర్పును
వెల్లడించిన
ముంబైలోని
టాడా
కోర్టు.
12
మందికి
ఉరిశిక్ష,
20
మందికి
యావజ్జీవ
ఖైదు
ఖరారు.
2013
మార్చి
21:
యాకూబ్
మెమన్,
టైగర్
మెమన్ల
ఉరిశిక్షలను
ధ్రువీకరించిన
సుప్రీంకోర్టు.
పది
మందికి
శిక్షలను
యావజ్జీవంగా
మార్పు.
2014
మే:
యాకుబ్
క్షమాభిక్ష
పిటిషన్ను
తోసిపుచ్చిన
రాష్ట్రపతి
ప్రణబ్.
2014
జూన్
2:
క్షమాభిక్ష
పిటిషన్లను
ఓపెన్
కోర్టులోనే
విచారణ
జరపాలన్న
నిబంధన
మేరకు,
ఉరిశిక్షను
నిలిపివేసిన
అత్యున్నత
న్యాయస్ధానం.
2015
ఏప్రిల్
9:
మరణశిక్షపై
యాకూబ్
దాఖలు
చేసిన
రివ్యూ
పిటిషన్ను
తోసిపుచ్చిన
సుప్రీంకోర్టు.
2015
జూలై
21:
క్యూరిటివ్
పిటిషన్
తొసిపుచ్చిన
సుప్రీం
కోర్టు.
జులై
30న
ఉరిశిక్ష.
2015
జూలై
25:
మరణ
శిక్ష
అమలుపై
స్టే
విధించాలని
సుప్రీంకోర్టును
ఆశ్రయించిన
మెమన్
2015
జూలై
28:
మెమన్
పిటిషన్
పై
నిర్ణయం
త్రిసభ్య
ధర్మాసనానికి
అప్పగింత
2015
జూలై
29:
యాకుబ్
మెమన్
క్యూరేటివ్
పిటిషన్
తిరస్కరణ,
ఉరిశిక్ష
అమలుపై
స్టే
విధించేందుకు
సుప్రీంకోర్టు
త్రిసభ్య
బెంచ్
నిరాకరణ