మరో సింహం వచ్చిందని!: సింహం పిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దు చేసిన మంత్రి
చెన్నై/టోక్యో: తమిళనాడు మత్స్యశాఖ మంత్రి జయకుమార్ ఇటీవల తన జపాన్ పర్యనట సందర్భంగా అక్కడి జపాన్ ఇంటర్నేషనల్ సీఫుడ్ అండ్ టెక్నాలజీ ఎక్స్పోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
మత్య్సశాఖకు, సముద్రపు ఆహారానికి సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఫుజిలోని సఫారీ పార్కును సందర్శనకు వెళ్లారు. ఆయన పార్కులో పర్యటిస్తుండగా అక్కడ జయకుమార్కు ఓ సింహం పిల్ల కనబడింది.
దానిని చూసి ముచ్చటపడిన ఆయన నిర్వాహకులను అడిగి కాసేపు దానిని ఎత్తుకొని ముద్దు చేశారు. దానిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఫొటో దిగారు. ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.
சிங்கம் சிங்களாதான் வரும்... தமிழகத்தின் கர்ஜனை இன்று ஜப்பானில் சிங்கக்குட்டியுடன்.
— D.JAYAKUMAR (@djayakumarfans) August 25, 2018
நமது அமைச்சர் #djayakumar அவர்கள் ஜப்பானின் பியூஜி நகரில் சிங்கக்குட்டியுடன்...#மிளிரும்மீன்வளம் pic.twitter.com/rQNjN8OIBb
అంతేకాదు సింహం పిల్లను ఎత్తుకున్నప్పుడు తన కలిగిన ఆలోచనలను ఓ పద్యంలా కూడా రాశారు. ఆ సింహం పిల్ల తనను చూసి తమిళనాడు నుంచి మరో సింహం వచ్చిందని అనుకుందని, తనను తన తండ్రి అనుకుని తన ఒడిలోకి వచ్చి కూర్చుందని రాశారు. ఆ పద్యాన్ని పలువురికి షేర్ చేశారు.