3 గంటలు రహదారుల దిగ్భందనం.. ఈ రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా...
వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై భారతీయ కిసాన్ యూనియన్ ఆందోళన కొనసాగుతూనే ఉంది. చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని రైతు నేతల ప్రొటెస్ట్ కంటిన్యూ అవుతోంది. తమ నిరసనను మరింత ఉధృతం చేయాలని కిసాన్ యూనియన్ భావించింది. అందులో భాగంగా ఇవాళ 3 గంటలపాటు రహదారులను దిగ్బందిస్తామని పేర్కొన్నది. తమ నిరసన కేవలం అన్నదాత ప్రయోజనం కోసమేనని స్పష్టంచేసింది.
మద్యాహ్నం 12 గంటల నుంచి రహదారులను దిగ్బందిస్తామని కిసాన్ యూనియన్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ దిగ్బందనం కొనసాగుతోందని వెల్లడించింది. అయితే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్కు మాత్రం మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. నిరసనలో పాల్గొనే వారికి ఆహారం, మంచినీరు అందజేస్తామని కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో 40 రైతు సంఘాలు పాల్గొనే అవకాశం ఉంది. ఇతర సంఘాలు, రైతులు, ఇతరులు కూడా భాగస్వాములు అవుతారని టికాయత్ వెల్లడించారు.
వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతోంది. 3 చట్టాలను వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు. పంటకు మద్దతు ధర ఇవ్వాలి.. సహా ఇతర డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. వీరి ఆందోళన పీక్కి చేరింది. రిపబ్లిక్ డే రోజున చేసిన ఆందోళన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎర్రకోట వరకు చేరి.. రైతులు జెండా ఉంచడం హై టెన్షన్ నెలకొంది. ఆ క్రమంలో రైతులు/ పోలీసులు మధ్య జరిగిన తోపులాటలో పలువురు గాయపడ్డారు.