వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేడే కేంద్ర క్యాబినెట్ భేటీ ... కీలక నిర్ణయాలు .. ఈ మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Elections 2019: CEC Might Announce The Schedule On 8th March | oneidia Telugu

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ చివరి కేబినెట్ భేటీ నేడు కాబోతుంది. ఈ భేటీ తర్వాత ఎన్నికల కురుక్షేత్రంలో నువ్వా నేనా అన్నట్టు తలపడనున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలో జరగనున్న చివరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్ భేటీలో చాలా కీలక నిర్ణయాలు ఉంటాయని, భారీ వరాలను ప్రకటించే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు.కేబినెట్‌ సమావేశం అనంతరం ఏ క్షణమైనా ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.

మోడీ నేతృత్వంలో చివరి క్యాబినెట్ భేటీ .. పలు కీలక నిర్ణయాలు

మోడీ నేతృత్వంలో చివరి క్యాబినెట్ భేటీ .. పలు కీలక నిర్ణయాలు

కేబినెట్‌ సమావేశం అనంతరం ఏ క్షణమైనా ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రధాని మోదీ శనివారం యూపీ, బీహార్లలో పలు శంకుస్థాపన లో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రకటన చేస్తారని కూడా ప్రచారం అవుతోంది.

అయితే ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ ఇస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఈ శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొనే వీలుండదు. మరి అప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకుండా ఆగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

రాఫెల్ వివాదం: మోడీని విచారణ చేసేందుకు ఇంతకంటే రుజువులు ఏమి కావాలిరాఫెల్ వివాదం: మోడీని విచారణ చేసేందుకు ఇంతకంటే రుజువులు ఏమి కావాలి

శుక్రవారం షెడ్యూల్ ప్రకటిస్తుందా.. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఇప్పుడు లేనట్టేనా..

శుక్రవారం షెడ్యూల్ ప్రకటిస్తుందా.. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఇప్పుడు లేనట్టేనా..

ప్రతీ శుక్రవారం ఎన్నికల సంఘం సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడం సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం శుక్రవారం త్రిసభ్య ఎన్నికల సంఘం సమావేశమై లోక్‌సభతో పాటు ఏపీ, జమ్మూ కశ్మీర్‌, ఒరిస్సా, మరో రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ఎన్నికలు ఎప్పుడు ఉండకపోవచ్చు అన్న భావన కూడా వ్యక్తమవుతోంది. అయితే, శుక్రవారమే షెడ్యూల్‌ ప్రకటన ఉంటుందా? శని, ఆదివారాల వరకు వేచిచూడాల్సి వస్తుందా? అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.

శని వారం మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు .. షెడ్యూల్ ఆలస్యం అవుతుందా ?

శని వారం మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు .. షెడ్యూల్ ఆలస్యం అవుతుందా ?

శనివారం ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటిదాకా ఎన్నికల సంఘం ఆగుతుందా? అనేది చూడాల్సి ఉంది. ప్రధాని కోసం ఈసీ ఆగితే షెడ్యూల్‌ ప్రకటన ఆదివారం వెలువడే అవకాశం ఉంది. 2014లో మార్చి 5న షెడ్యూల్‌ ప్రకటన వెలువడగా, 25 రోజుల తర్వాత తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 7న జరిగింది. ఇప్పటికే ఎన్నికల తేదీల ప్రకటన ఆలస్యం అయినందున పదో తేదీన ప్రకటన వెలువడితే తొలిదశ పోలింగ్‌కు 25 రోజుల వ్యవధి ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లా ఈసారి తొమ్మిది దశల పోలింగ్‌ జరిగేదీ అనుమానమేనని అంటున్నారు. ఈసారి ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో త్వరితగతిన షెడ్యూల్ రిలీజ్ చేసి ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

English summary
The Central Election Commission is preparing for general elections. The final meeting of the Union Cabinet on today i.e March 7th is to be held and there is a possibility to take key decisions during the elections. the CEC might announce the schedule on Friday 8th after the meeting? if not the shedule will be announced on 10th. The Election Commission has completed the preparatory works for the lok sabha polls and also the four states assembly polls .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X