వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ హిజ్బుల్ కమాండర్ మసూద్ అలియాస్ రహీ మృతి: మరో ఇద్దరు కూడా..

|
Google Oneindia TeluguNews

భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో హిజ్బుల్ టాప్ కమాండర్ మసూద్ అలియాస్ రహి చనిపోయాడు. జమ్ముకశ్మీన్‌లో జరిపిన కాల్పుల్లో రహి సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని పోలీసులు తెలిపారు. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు చనిపోవడంతో దోడ జిల్లా ఉగ్రవాద రహిత జిల్లాగా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.

అనంత్ నాగ్ ఖుల్ చోహర్ వద్ద భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. హిజ్బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ రహీ, జిల్లా కమాండర్ సహా మరొకరు చనిపోయారని జమ్ముకశ్మీర్ డీజీపీ దలిబాగ్ సింగ్ తెలిపారు.

Top Hizbul commander killed in J&K; Doda declared free of terrorists..

చనిపోయిన ఉగ్రవాది రహీ ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాడు. 2018లో భారీగా ఆయుధాలను కూడా ఎత్తుకెళ్లాడు. దోడా జిల్లాలో మైనర్ బాలికపై లైంగికదాడి చేశాడు. రహీ హిజ్బుల్ ముజాహిద్దీన్‌లో చేరాక.. దోడా నుంచి మకాం కశ్మీర్‌కు మార్చాడు.

అతని సోదరుడు ఫరూఖ్ అహ్మద్ 1999 నుంచి పాకిస్తాన్‌లో ఉగ్రవాదిగా ఉన్నాడు. జూన్‌లో అత్యధికంగా 46 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిరకు 116 మంది ఉగ్రవాదులు చనిపోయారు.

English summary
Top Hizbul commander Masood alias Rahi was killed in an operation on Monday in Jammu and Kashmir's Anantnag, along with two other terrorists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X