జమ్ము,కశ్మీర్లో ఊపందుకున్న టూరిజం... రిసార్ట్స్ ఏర్పాటుకు ఉత్సహాం చూపుతున్న రాష్ట్రాలు
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370,35ఏలను రద్దు చేయడంతో దేశంలో రియల్ వ్యాపారులతో పాటు ఇతర పారీశ్రామిక వేత్తలు అక్కడ తమ వ్యాపారాలు నెలకొల్పేందుకు సిద్దం అవుతున్నారు.ముఖ్యంగా భూతల స్వర్గంగా పేరు గాంచిన కశ్మీర్లో పర్యటక రంగం పై పలు రాష్ట్రాలు దృష్టి సారించాయి. రానున్న రోజుల్లో కశ్మీర్లో శాంతి భద్రతలు అదుపులోకి రానున్న నేపథ్యంతో అక్కడ తమ వ్యాపారాలను విసృత పరించేందుకు సన్నద్దం అవుతున్నారు. ముఖ్యంగా హోటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి.
సాధరణంగా దేశంలోని ఆయా రాష్ట్రా ప్రభుత్వం టూరిజంలో భాగంగా పలు రాష్ట్రాల్లో తమ కార్యాలయాలు, రిసార్టులు ఏర్పాటు చేస్తారు.ఇందులో భాగంగానే లడాక్ కేంద్ర పాలిత ప్రాంతం కావడం అక్కడికి టూరిస్టిలు పెద్ద ఎత్తున వెళ్లే అవకాశాలు ఉండడంతో అక్కడ పలు రాష్ట్రాలు టూరిజం అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయం చేశాయి.పర్యటకుల కోసం ప్రత్యేక పలు ఏర్పాట్లను చేసేందుకు ఆయా ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి.
కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 370తో పాటు, ఆర్టికల్ 35ఏ ను రద్దు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్, లడాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అంతరించనున్నాయంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు సోమవారం రాజ్యసభలో ఆమోదం లభించగా మంగళవారం లోక్సభలో సైతం అమోదం పోందింది.. దీంతో జమ్మూ కశ్మీర్, లడాఖ్లో భూమిని కొనుగోలు చేయకుండా బయటి వ్యక్తులపై ఉన్న నిషేధం నిలిచిపోతుందని అంతా భావిస్తున్నారు.