పెళ్లికి వెళ్లిన గిరిజన యువతి కిడ్నాప్, గ్యాంగ్రేప్
కోల్కతా: బంధువుల వివాహానికి వెళ్లిన ఓ గిరిజన యువతిపై పలువురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను కిడ్నాప్ చేసిన నిందితులు, ఆమెపై ఒకరి తర్వాత ఒకరు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇలా ఎనిమిది మంది ఆమెపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.
ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోలోని బీర్భూమ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తంతిపరలో శుక్రవారం రాత్రి ఓ వివాహం కార్యక్రమంలో పాల్గొనేందుకు గిరిజ యువతి వెళ్లింది.
తనను 6 నుంచి 8 మంది కిడ్నాప్ చేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అక్కడ నుంచి సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్ళి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
లైంగికదాడికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టామని, వారికి తొమ్మిది రోజుల కష్టడీ విధించడం జరిగిందని పోలీసులు చెప్పారు.