వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవత్వం మంటగలిపారు: ఆ యువకుడి హత్య, ఆపై సెల్ఫీలు..

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: దొంగతనం చేశాడన్న ఆరోపణలతో మానసిక వైకల్యం ఉన్న ఓ గిరిజన యువకుడిపై తీవ్రంగా దాడి చేసి హత్య చేసిన ఘటన కేరళలోని పాలక్కడ్ జిల్లా అత్తపాడిలో చోటు చేసుకుంది.

మృతుడు స్థానిక గిరిజనుడు..

మృతుడు స్థానిక గిరిజనుడు..

గురువారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితుడిని కదుకుమన్నకు చెందిన ఎ.మధుగా గుర్తించారు. అత్తపాడికి సమీపంలోని ఓ అడవిలో సాయంత్రం 4గం. సమయంలో మధు ఆ ప్రాంతంలో తిరగడం స్థానికులు గమనించారు.

దొంగతనం చేశాడని దాడి..

దొంగతనం చేశాడని దాడి..

అంతకు మూడు రోజుల ముందు స్థానికంగా ఒకరి ఇంట్లో దొంగతనం జరిగింది. దీంతో ఆ దొంగతనం చేసింది మధునే అన్న అనుమానంతో అతనిపై దాడి కర్రలతో దాడి చేశారు.

దాడి అనంతరం పోలీసులకు అప్పగించగా.. జీపులో స్టేషనుకు తరలిస్తున్న క్రమంలో మధు కుప్పకూలిపోయాడు. దీంతో అతను చనిపోయినట్టుగా గుర్తించారు.

మానవత్వం మంటగలిసింది..

మానవత్వం మంటగలిసింది..

ఓ మానపసిక వైకల్యం ఉన్న వ్యక్తిపై అంత తీవ్రంగా దాడి జరుగుతుంటే.. కొంతమంది యువకులు అక్కడ సెల్ఫీలు దిగడం గమనార్హం. మానవత్వం ఉన్న సాటి మనుషులుగా దాడిని ఆపాల్సిందిపోయి సెల్ఫీల కోసం ఎగబడటం విచారకరం.

 15మందిపై కేసు:

15మందిపై కేసు:

దాడికి పాల్పడిన 15మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

English summary
A 27-year-old tribal youth, accused of theft, was beaten to death by local people at Kadukumanna in Attappady, near here, on Thursday evening, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X