లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పని ఫినిష్, ఆస్తులు హుష్ కాకి
బెంగళూరు: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మళ్లీ మరిన్ని కష్టాలు మొదలైనాయి. బెంగళూరు రుణ రికవరీ ట్రిబునల్ బెంచ్ తాజా తీర్పుతో విజయ్ మాల్యాకు మరిన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయి.
కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి రికవరీ ప్రక్రియ ప్రారంభించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్జియంకు అనుమతి మంజూరు చేస్తూ గురువారం డీఆర్ టీ తీర్పు చెప్పింది.
రుణాల రికవరీకి విజమ్ మాల్యా ఆస్తులు ఎటాచ్ మెంట్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. రూ. 6,203 కోట్ల రుణాలపై జులై 26, 2013 నుంచి 11.5 శాతం వడ్డీని రాబట్టవచ్చని చెప్పింది. ఈ తీర్పుపై మాల్యా డీఆర్ ఏటీలో పునర్విచారణకు వెళ్లాలనుకుంటే మొత్తంలో 50 శాతం కోర్టు ఫీజులుగా చెల్లించాలని సంచల తీర్పు చెప్పింది.
రుణాలను రికవరీ చెయ్యాలని గత మూడేళ్లుగా బ్యాంకులు చేస్తున్న చట్టపరమైన పోరాటం ముగిసినట్లు అయ్యిందని బ్యాంకుల తరుపున వాదిస్తున్న న్యాయవాది మీడియాకు చెప్పారు.