వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్యుని ఇంట్లోకి ఆగంతకుడు, మూడు హత్యలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భువనేశ్వర్ సిటీలోని ఖందగిరి విహార్‌లో ఓ వైద్యుని ఇంట్లో మగ్గురు హత్య చేయబడ్డారు. ఈ ఘటన ఆ పరిసర ప్రాంతాల్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఆర్దోపెడిక్ సర్జన్‌గా ఉన్న అతుల్య చంద్ర మెహర్ ఇంట్లోకి ఆ ఆగంతకుడు చాకచక్యంగా ప్రవేశించి అతని ఇంట్లో సంరక్షుడిగా ఉన్న కుటుంబంపై దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌తో పాటు మరో ఇద్దరు చనిపోయారని నగర కమిషనర్ రాజేంద్ర శర్మ తెలిపారు.

వివరాల్లోకి వెళితే డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌ ఇంటి క్రింది విభాగంలో పవివాళ్లు ఉండే నివాసంలో ప్రశాంత్ బెహ్రాతో పాటు అతని భార్య, కుమారుడు నివసిస్తున్నారు. ఆ ఆగంతకుడు ప్రశాంత్ బెహ్రాతో పాటు, భార్య కుమారుడిపై దాడి చేశాడని పేర్కొన్నారు.

Triple murder at doctor's house in Bhubaneswar

దీంతో తొలి అంతస్తులో ఉంటున్న డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌ క్రింద ఇంట్లో ఏదో అలజడి జరుగుతుందని గ్రహించి అక్కడకి రావడంతో... అతనిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనలో డాక్టర్ అతుల్య చంద్ర మెహర్‌‌తో పాటు, సంరక్షకుడు ప్రశాంత్ బెహ్రా, అతని కుమారుడు మరణించారని తెలిపారు.

ఐతే ఈ ఘటన నుండి ప్రాణాలతో బయటపడిన ప్రశాంత్ బెహ్రా భార్యను కటక్‌లోని ఎస్‌సీబి మెడికల్ కాలేజీకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

English summary
The alleged accused entered the house of Dr Atulya Chandra Meher, an Orthopaedic surgeon, and proceeded to the servants quarter behind the residence, where caretaker Prashant Behera, used to reside with his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X