ప్రధాని మోడికి రాఖి కట్టనున్న పోరాట యోధురాలు ఇష్రత్ జహన్
ట్రిపుల్ తలాక్ రద్దుపై వీరోచిత పోరాటం చేసిన ఇష్రత్ జహాన్కు ప్రధాని నరేంద్రమోడీకి రాఖీ కట్టనుంది. ఇందుకోసం ఆమేకు ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయం నుండి ఆమేకు పిలుపువచ్చింది. రాఖీ పౌర్ణమితోపాటు స్వాతంత్ర్య దినోత్సం కావడంతో మూడు రంగుల రాఖీని కట్టేందుకు ఇష్రత్ జహాన్ కోల్కతా నుండి డిల్లీకి పయనమైంది.
ట్రిపుల్ తలాక్ రద్దుపై సుప్రిం కోర్టుకు వెళ్లిన ,బీజేపీ కార్యకర్త ఇష్రత్ జహాన్ గురించి వినే ఉంటారు. ఇప్పుడు ఆమేకు అరుదైన అవకాశం లభించింది. దేశ ప్రధాని మోడీకి రాఖీ కట్టే అవకాశం వచ్చింది. దీంతో ఆమే ఈ సంధర్భంగా మీడీయాతో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటీ అవకాశం ఎప్పుడు రాదని భావించానని చెప్పారు. కాగా ఈ సంధర్భం చాల రోజుల పాటు వేచి చూశానని ఇప్పుడు ఆ కల నెరవేరిందని అన్నారు.కాగా రేపు ఇండిపెండెంట్ డే కూడ కావడంతో ట్రై కలర్ రాఖి కట్టనున్నట్టు స్పష్టం చేసింది.
పార్లమెంట్లో ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ నేపథ్యంలో నేడు ప్రత్యేక దినంగా ఆమే అభివర్ణించారు. కాగా మోడీని మొదటి సారిగా కలవనున్న ఇష్రత్ జహాన్ ఆయన కోసం కోల్కతా ప్రత్యేకంగా నిలిచే రసగుల్లాలను కూడ తీసుకెళ్లనున్నట్టు తెలిపింది.ఈ నేపథ్యంలోనే మోడి పదికాలాల పాటు జీవించాలని కూడ కోరుకుంది.