బాతులు నీటిలో ఈదితే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి: త్రిపుర సీఎం
Recommended Video
అగర్తాల: అసోం ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో బాతులను పంపిణీ చేస్తామని చెప్పారు. బాతులను ఎందుకు పంపిణీ చేస్తామో కూడా ఆయన వెల్లడించారు.
నీటిలో బాతులు ఈదితే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని తెలిపారు. కాబట్టి నీటి మడుగులు, చెరువుల సమీపంలోని గ్రామాల ప్రజలకు 50వేల బాతులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు.
రుద్రసాగర్లో సంప్రదాయ పడవ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బాతులు నీటిలో ఈదడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని, వాటిని అందరూ పెంచుకోవాలన్నారు.
నీటిలో బాతులు ఈదేటప్పుడు ఆక్సిజన్ లెవల్స్ వాటంతట అవే పెరుగుతాయని, నీరు రీసైకిల్ అవుతుందని తెలిపారు. నీటిలోని చేపలకు ఆస్జిన్ అందుతుందని, బాతులు వేసే రెట్టలవల్ల చేపలకు ఆహారం కూడా లభిస్తుందని చెప్పారు. దీంతో చేపలు వేగంగా పెరుగుతాయన్నారు. మత్స్య సంపద పెరుగుతుందని తెలిపారు.