వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొరపాటుకు చింతిస్తున్నా..: మాజీ ప్రధాని ఇకలేరంటూ గవర్నర్ ట్వీట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని వాజపేయి ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఇకలేరంటూ త్రిపుర గవర్నర్ తథాగత రాయ్ చేసిన ట్వీట్ కలకలం రేపింది.

'గొప్ప వక్త, ఆరు దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ధృవతారలా వెలిగిన మాజీ ప్రధాని వాజపేయి ఇకలేరు. ఓం శాంతి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ అయింది. దీంతో, ఆయనపై నెటిజన్లు విమర్శలు చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న తథాగత రాయ్ తన ట్వీట్ ను తొలగించారు.

Tripura Governor Tathagata Roy announces Vajpayee is dead, then deletes tweet

Recommended Video

వాజ్‌పేయి హెల్త్‌ బులెటిన్‌ - ఆరోగ్యం మరింత విషమం!

'నన్ను క్షమించండి. ఓ జాతీయ మీడియా ఛానల్‌లో వచ్చిన వార్తను చూసి నేను ట్వీట్ చేశాను. ట్వీట్ చేసే ముందు అది నిజమా, కాదా? అనే విషయాన్ని తెలుసుకుని ఉండాల్సింది. వాజపేయి గురించి ఎలాంటి అధికారిక వార్త వెలువడలేదు. నా ట్వీట్ ను తొలగించాను. క్షమించండి' అంటూ మరో ట్వీట్ చేశారు తథగాగత రాయ్.

Tripura Governor Tathagata Roy announces Vajpayee is dead, then deletes tweet

వాజపేయి ఆరోగ్యం విషమంగానే ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని ఎయిమ్స్ వైద్యులు గురువారం ఉదయం హెల్త్ బులెటిన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

English summary
Governor of Tripura Tathagata Roy made a major faux-pas Thursday by announcing on Twitter that former Prime Minister Atal Behari Vajpayee had passed away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X