బ్రిటన్ రెండో అతిపెద్ద కోర్టులో విజయ్ మాల్యాకు మరో ఎదురుదెబ్బ
లండన్: విజయ్ మాల్యాకు లండన్ కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. యునైటెడ్ కింగ్డమ్లోని రెండో అతిపెద్ద కోర్టులో మాల్యాకు చుక్కెదురైంది. బ్రిటన్ హైకోర్టు ఆదేశాలపై అప్పీల్ చేసుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయన అప్పీళ్లను కోర్టు తోసిపుచ్చింది.
తన ఆస్తులను స్తంభింప చేయడానికి ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని మాల్యా అప్పీల్ చేసుకున్నారు. దీనిని బ్రిటన్ హైకోర్టు మే 8వ తేదీన కొట్టివేసింది. ఆదేశాలకు నిరాకరించింది. దీంతో ఆయన అప్పిలేట్ కోర్టును ఆశ్రయించారు.
విజయ్ మాల్యా వినతిని పరిశీలించిన అప్పిలేట్ కోర్టు తిరస్కరించింది. మే 8న హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల పదమూడు భారతీయ బ్యాంకులు తమ రుణాలను తిరిగి రాబట్టుకోవడానికి బ్రిటన్లోని మాల్యా ఆస్తులపై భారత తీర్పులను వర్తింపజేసే హక్కు కలుగుతుంది. తాజాగా ఎదురుదెబ్బ నేపథ్యంలో ఆయనకు తదుపరి అపీళ్లకు అవకాశాలు మూసుకుపోయాయి.