శ్రేష్ఠ్ సంసద్ సర్వే: ఫేమ్ ఇండియా ఉత్తమ పార్లమెంటేరియన్గా కవిత ఎంపిక
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేమ్ ఇండియా ఎక్స్ట్రా ఆర్డినరీ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఫేమ్ ఇండియా - ఏసియా పోస్ట్ మేగజైన్ ఆదర్శ్ విభాగంలో నిర్వహించిన శ్రేష్ట్ సంసద్ సర్వేలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికయ్యారు.
ఈ నెల 31న దేశ రాజధాని ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరగనున్న కార్యక్రమంలో ఆమె ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ అవార్డుపై కవిత తన ట్విట్టర్ అకౌంట్లో స్పందించారు. తనకు ఈ అవార్డు ఇస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పారు.
Thankful and humbled on being named as the Fame India extraordinary parliamentarian. People’s love and recognition inspires us to work even harder for the community. @FameIndia100 pic.twitter.com/FXzwjOsK6L
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 21, 2019
కాగా, తెలంగాణ మలిదశ పోరాటంలో కవిత ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. ఎన్నో పోలీసు కేసులను ఎదుర్కొన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించి తెలంగాణకు సేవ చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయ ఆరంగ్రేటం చేసి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఎన్నో సమస్యలపై పార్లమెంటులో నిలదీశారు.