నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది: సోషల్ మీడియాలో రాబర్డ్ వాద్రా
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రాను ఈడీ అధికారులు ఇప్పటికే మూడుసార్లు విచారించారు. దీనిపై ఆదివారం సోషల్ మీడియా వేదికగా రాబర్డ్ వాద్రా స్పందించారు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందని చెప్పారు.
తన ఫేస్బుక్ వేదికగా వాద్రా అభిప్రాయాన్ని తెలిపారు. శనివారం మూడోసారి ఈడీ ఎదుట హాజరైన రాబర్ట్ వాద్రాను అధికారులు పదిహేను గంటల పాటు ప్రశ్నించారు. తనకు మద్దతుగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలని, ప్రస్తుతం కాను బాగానే ఉన్నానని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నానని, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని చెప్పారు.
లండన్లో అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్డ్ వాద్రాను ఈడీ ఫిబ్రవరి 6, 7, 9 తేదీల్లో సుదీర్ఘంగా విచారించింది. అలాగే మరో వివాదంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఫిబ్రవరి 12న జైపూర్లో మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారని తెలుస్తోంది.