దెబ్బకు దెబ్బ: పన్నీర్ సెల్వం గూటికి లోక్ సభ ఎంపీలు: శశికళ పని!
చెన్నై: తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు గంట గంటకు మద్దతు పెరిగిపోతుండటంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులు హడలిపోతున్నారు. తాజాగా ఇద్దరు అన్నాడీఎంకే లోక్ సభ సభ్యులు పన్నీర్ సెల్వంకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
జయలలిత ఆత్మ శాంతించే వరకు శశికళ సీఎం కాలేరంట!
నమ్మక్కల్ లోక్ సభ నియోజక వర్గం ఎంపీ పీఆర్. సుందరం, క్రిష్ణగరి లోక్ సభ నియోజక వర్గం ఎంపీ అశోక్ కుమార్ లు శనివారం తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పన్నీర్ సెల్వం ఇంటి దగ్గరికి చేరుకున్న ఎంపీలు మీకు మద్దతు ఇస్తున్నామని మీరే సీఎంగా కొనసాగాలని ఆయనకు చెప్పారు.
ఇదే సమయంలో పన్నీర్ సెల్వం ఇంటి దగ్గరకు తమిళనాడులోని వివిద జిల్లాల నుంచి వస్తున్న నాయకుల సంఖ్య పెరిగిపోతుంది. మాజీ మంత్రులు, అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకులు పన్నీర్ సెల్వంకు మద్దతుగా ఆయన ఇంటి దగ్గరకు చేరుకుంటున్నారు.
రిసార్ట్ బాత్రూంలో దూరి తప్పించుకున్న ఎమ్మెల్యే: శశికళ వర్గంపై కేసు పెట్టి!
ఈ పరిణామాలు గమనిస్తున్న చిన్నమ్మ శశికళ వర్గీయులు మరింత ఆందోళనకు గురైనారు. పరిస్థితి ఇలాగే ఉంటే మనకు కష్టకాలం ఎదురౌతుందని ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా చిన్నమ్మను సీఎం చేసేసి ఊపిరి పీల్చుకోవాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.