వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు బెదిరింపు: ఢిల్లీలో దిగిన టర్కీష్ విమానం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: టర్కీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఆ విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా దించి వేశారు. ఈ విమానంలో 150 మంది ప్రయాణీకులు ఉన్నారు.

టర్కీష్ ఎయిర్‌లైన్స్ విమానం టికె65 బ్యాంకాక్ నుంచి ఇస్తాంబుల్ వెళుతుండగా.. పైలట్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ మీదుగా విమానం వెళుతున్న ఆ విమానం అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించేశారు.

Turkish Airlines plane makes emergency landing at IGI Delhi following bomb threat

ఢిల్లీ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చి.. ఆ విమానాన్ని లాండ్ చేశారు. విమానాశ్రయంలో దూరంగా దిగిన ఆ విమానంలో తనిఖీలు జరుగుతున్నాయి. భారత భద్రతా దళాలు సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌జి భారీగా చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

కాగా, తనిఖీల అనంతరం బాంబు లేదని భద్రతా దళాలు నిర్ధారించాయి. అయితే విమానం బాత్‌రూమ్‌లో ఉన్న అద్దంపై విమానంలో బాంబు పెట్టినట్లు లిప్‌స్టిక్‌తో రాసి ఉందని పైలట్ ఏయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్‌కు సమాచారం అందించారు. బాంబు లేదని తేలడంతో విమానాశ్రయ అధికారులు, పైలట్లు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

English summary
A Turkish Airlines flight made an emergency landing at the Indira Gandhi International Airport in New Delhi following a bomb threat on Tuesday afternoon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X