12 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్: 5 నెలలుగా లైంగికదాడి, 4 నెలల గర్భవతి కావడంతో.. పోక్సో చట్టం కింద..
దేశంలో ఎక్కడో ఓ చోట రోజు లైంగికదాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే చిన్నారులను కూడా వదలడం లేదు కామాంధులు. ఏళ్ల వయస్సు గల పిల్లలపై లైంగికదాడి చేస్తున్నారు. పేరంట్స్కు చెప్పొద్దని బెదిరించడంతో.. చిన్నారులు గమ్మున ఉంటున్నారు. ఇలా కొందరు గర్భం కూడా దాలుస్తున్నారు. ఏమీ తెలియని పసితనంలోనే వారు ప్రెగ్నెంట్ కావడం ఆందోళన కలిగిస్తోంది. 3 నుంచి 5 నెలల గర్భం అయితే.. వారికి ఎలా అబార్షన్ చేయాలని వైద్యులు అంటున్నారు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చినా.. కామాంధులు మాత్రం వణకకుండా.. బెదరకుండా రెచ్చిపోతూనే ఉన్నారు.
ముగ్గురి కలిసి మైనర్ బాలికపై
గుజరాత్ నవసరి జిల్లాలో దారుణ జరిగింది. ఓ వ్యవసాయ కూలీ కుతూరు వయస్సు 12 ఏళ్లు. అయితే ఆమె ఇంటి వద్దే ఉండేది. కరోనా కాలం కావడంతో బడులు కూడా లేవు. పొట్టకూటి కోసం తల్లిదండ్రులు పనులకు వెళ్లేవారు. అయితే ఇదే అదనుగా భావించాడు ఓ కామాంధుడు. మెల్లగా చిన్నారిని లోబరచుకున్నాడు. లైంగికదాడి చేయడం ప్రారంభించాడు. అయితే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పొద్దని.. చెబితే చంపేస్తానని బెదరించాడు. దీంతో ఆమె భయపడింది. అతనే కాక మరో ఇద్దరికీ కూడా చెప్పాడు. ఇంకేముంది వారు కూడా లైంగికదాడి చేయడం ప్రారంభించారు. దీంతో ఆ చిన్నారి వారి మధ్య నలిగిపోయింది.
కడుపునొప్పి రావడంతో..
అయితే ఇటీవల చిన్నారికి కడుపునొప్పి వచ్చింది. ఏం జరిగిందో ఏమో తెలియదు. తీవ్రం కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించారు. అన్నీ టెస్టులు చేయగా.. గర్భవతి అని తేలింది. అప్పుడు జరిగిన ఘటన గురించి చిన్నారి తెలియజేసింది. ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. వైద్యుల సూచన మేరకు మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. కానీ ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.
Recommended Video
బాలిక వాంగ్మూలం..
విషయం తెలిసిన పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. బాలిక వాంగ్మూలం తీసుకున్నారు. పేరంట్స్ ఫిర్యాదు చేయడంతో.. ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వారంతా 18 ఏళ్ల వయస్సు గల వారు అని, స్థానికులు తెలిపారని చెప్పారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారని.. వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని వివరించారు. కానీ ఘటనపై ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.