శ్రీశ్రీపై హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వీట్, వివాదం
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య, మాజీ హీరోయిన్ ట్వింకిల్ కన్నా వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం రచయితగా, కాలమిస్ట్గా ఆమె పని ఉన్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. చలోక్తులు విసరడంలో ధిట్ట.
ఆమె చేసే వ్యంగ్య వ్యాఖ్యలు కొన్నిసార్లు ఆనందాన్ని ఇస్తే, మరికొన్నిసార్లు వివాదాలు రేపాయి. తాజాగా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రావిశంకర్ను ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ దుమారం రేపింది.
'శ్రీశ్రీవి ఉదాత్తమైన ఆలోచనలు. కానీ యోగా చేసేటప్పుడు ఆయన సగం గడ్డం నోటిలోకి వెళ్తుంది. ఈ విషయంలో రాందేవ్ బాబా పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు' అని ట్వింకిల్ కన్నా ట్వీట్ చేశారు. దీనికి పవిత్ర పురుషుల వెంట్రుకల కథలు అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది.
ఆమె వ్యాఖ్యలు శ్రీశ్రీ రవిశంకర్ అభిమానులను గాయపర్చింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అక్షయ్ కుమార్ తాజా చిత్రం హౌస్ఫుల్ 3 సినిమాను బహిష్కరిస్తామని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ డైరెక్టర్ దర్శక్ హాథీ ట్వీట్ చేశారు.
వివాదం నేపథ్యంలో ఆమె వెంటనే ఆ ట్వీట్ తొలగించారు. మరో ట్వీట్ పెట్టారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశ్యం తనకు లేదని, జోక్ మాత్రమే అన్నారు. పొరపాటు ఏదైనా జరిగితే సరిదిద్దుకోగలనని పేర్కొన్నారు. అదే సమయంలో దర్శక్ హాథీ ట్వీట్ పైన ఆమె ఘాటుగానే స్పందించారు.
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉపాధ్యాయుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ బెదిరింపులను అనుసరిస్తున్నారా, నేను ఏమైనా అంటే అడగాలని, అంతేకానీ నా భర్తను లాగి సినిమాను బహిష్కరిస్తామని హెచ్చరించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. దీంతో, తమ మనోభావాలు దెబ్బతినడం వల్లే అలా స్పందించానని, నా వ్యాఖ్యలు మిమ్మల్ని బాధిస్తే క్షమించాలని దర్శక్ హాథీ మరో ట్వీట్ చేశారు.